![Modi visit Mahakumbh Mela](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/05/5bSuWeoYMPUyyxOw8CtW.jpg)
Modi visit Mahakumbh Mela
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (బుధవారం, ఫిబ్రవరి 5) ప్రయాగ్రాజ్లో పర్యటించనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి చేరుకోనున్న మోదీ .. ఇక్కడ త్రివేణీ సంగమంలో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ వెంట సీఎ యోగి, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ సహా రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు సీనియర్ మంత్రులు హాజరుకానున్నారు.
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు ఇప్పటివరకు 14 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి అనేక మంది ఉన్నారు. వీరితో పాటుగా అనేక దేశాల ప్రతినిధులు కూడా స్నానం ఆచరించారు. ఫిబ్రవరి 26వ తేదీతో మహాకుంభమేళా ముగియనుంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నాటికి మహా కుంభమేళాలో 54 లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించారు.ఇప్పటివరకు మొత్తం 37.50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానమాచరించారని యూపీ ప్రభుత్వం తెలిపింది.
మోదీ కుంభమేళా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే
ఉదయం 10:05 - ప్రధాని మోదీ ప్రయాగ్రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
ఉదయం 10:10 – ఆయన ప్రయాగ్రాజ్ విమానాశ్రయం నుండి హెలిప్యాడ్కు వెళతారు.
ఉదయం 10:45 - ప్రధానమంత్రి ఏరియల్ ఘాట్ కు చేరుకుంటారు.
ఉదయం 10:50 – ఏరియల్ ఘాట్ నుండి పడవలో మహాకుంభమేళాకు చేరుకుంటారు.
ఉదయం 11:00 - 11:30 - మోదీ మహాకుంభమేళాలో స్నానం ఆచరించి పూజలు చేస్తారు.
ఉదయం 11:45 పడవలో ఆరేల్ ఘాట్కు తిరిగి వచ్చి, ఆపై హెలిప్యాడ్కు తిరిగి వెళ్లి ప్రయాగ్రాజ్ విమానాశ్రయానికి బయలుదేరుతారు.
12:30 PM - ప్రయాగ్రాజ్ నుండి ఢిల్లీకి బయలుదేరుతారు.
ఫిబ్రవరి 5న హిందూ సంప్రదాయంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది, హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం ఎనిమిదవ రోజున జరుపుకునే మాఘ అష్టమి, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు శుభప్రదం. ఫిబ్రవరి 5న భీష్మ అష్టమి కూడా ఉంది, ఇది మహాభారతంలోని యోధుడు భీష్మ పితామహుడితో ముడిపడి ఉన్న రోజు.