Delhi: ఢిల్లీలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్.. తర్వాత పూల వర్షం

హర్యాణా, పంజాబ్ రైతులు డిసెంబర్ 8 (ఆదివారం) ఛలో ఢిల్లీ ర్యాలీగా బయలుదేరారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. లాఠీ చార్జ్‌ చేశారు. బార్కెట్లను దాటడానికి వచ్చే రైతులను చెదరగొట్టారు.

author-image
By K Mohan
New Update
villl

దేశ రాజధాని ఢిల్లీలో మరో రాసి రైతులపై లాఠీఛార్జ్ జరిగింది. గత కొన్ని నెలలుగా హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీలో నిరసన తెలపడానికి ప్రయత్నిస్తు్న్నారు. ర్యాలీగా పార్లమెంట్ ఢిల్లీకి చేరుకొని తమ సమస్యలపై పోరాడదామనుకుంటున్నారు. అందుకోసం ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నిసార్లు నిరసనల కోసం ఢిల్లీకి వెళ్తామని బయలుదేరినా పోలీసు బలగాలు ఢిల్లీ సరిహద్దుల్లోనే వారిని అడ్డుకుంటున్నారు. తాజాగా 

రైతుల ఢిల్లీ చలో ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. లాఠీ చార్జ్‌ చేశారు. బార్కెట్లను దాటడానికి వచ్చే రైతులను చెదరగొట్టారు. రైతుల శాంతించిన తర్వాత పోలీసులు వారిపై పూలు చల్లారు.

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

 

నిరసన వ్యక్తం చేయడానికి రైతులు ముందుగానే అనుమతి పోలీసుల నుంచి తీసుకున్నామని అంటున్నారు.ముందు అనుమతి ఇచ్చి, ఇప్పుడు అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.  ఢిల్లీ ఛలో ర్యాలీలో 101 మంది రైతులమే వస్తామని అనుమతి తీసుకున్నారు. ఆ 101 మంది జాబితా ప్రకారం అనుమతి ఉన్న రైతులనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు అందరం గుంపుగా ర్యాలీకి వస్తామంటేనే అడ్డుకుంటున్నామని పోలీసులు తెలిపారు. శింభు సరిహద్దుల్లో రైతులు, పోలీసులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. రైతులను ర్యాలీగా రాజధానిలోకి అనుమతి ఇస్తారా లేదా అనేది చూడాలి.

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

ఇది కూడా చదవండి: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

ఇది కూడా చూడండి:  నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CRIME NEWS: అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్‌ కోస్టర్‌ నుంచి కిందపడి యువతి స్పాట్‌డెడ్!

ఢిల్లీలో 24 ఏళ్ల యువతి రోలర్‌ కోస్టర్ నుంచి కింద పడి మృతి చెందింది. ప్రియాంకకు నిఖిల్‌తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. సరదాగా తిరిగొద్దామని కాప్‌సహేడా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ ఎక్కారు. దాని స్టాండ్ విరగడంతో ఆమె కిందపడి మరణించింది.

New Update
Delhi woman dies after falling from Roller Coaster

Delhi woman dies after falling from Roller Coaster

నైరుతి ఢిల్లీలోని కపషెరా ప్రాంతంలో అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నుండి కింద పడి 24 ఏళ్ల ప్రియాంక మృతి చెందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ఘటన గురువారం జరిగిందని పోలీసులు తెలిపారు.  పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

ఏం జరిగిందంటే?

నిఖిల్ అనే వ్యక్తికి ప్రియాంకతో ఫిబ్రవరిలో నిశ్చితార్థం అయింది. ఇద్దరూ సరదాగా తిరుగొద్దామని ఫన్ అండ్ ఫుడ్ విలేజ్‌కు వెళ్లారు. అక్కడ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో గురువారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కారు. అదే సమయంలో రోలర్ కోస్టర్ స్టాండు విరిగి ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే కాబోయే భర్త నిఖిల్ ఆమెను సమీప హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే కాలి వేలికి ప్రమాదం

పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో మృతిచెందిన మృతురాలు ప్రియాంక శరీరంపై తీవ్ర గాయాలు బట్టి.. ENT రక్తస్రావం, కుడి కాలు చీలడం, ఎడమ కాలు మీద పంక్చర్ గాయం, కుడి ముంజేయి, ఎడమ మోకాలికి తీవ్ర గాయాలు ఉన్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: డేంజర్.. ఇలాంటి సన్‌స్క్రీన్ లు వాడితే ముఖంపై తెల్లటి మచ్చలు!

కాగా చాణక్యపురికి చెందిన ప్రియాంక.. నోయిడాలోని సెక్టార్ 3లోని ఒక టెలికాం కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరుడు, ఒక సోదరి ఉన్నారు. ప్రియాంకకు ఫిబ్రవరి 2026లో వివాహం జరగాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కూల్‌ డ్రింక్స్‌ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!

(crime news | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment