Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

భారత బాక్సర్ మేరీకోమ్ వీడాకులు తీసుకోబోతున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే మేరీకోమ్ దంపతులను దూరమయ్యేలా చేసిందనే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ విడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు మేరీకోమ్ దగ్గరే ఉంటున్నారు.

New Update
Mary Kom: కీలక పోస్టుకు రాజీనామా చేసిన బాక్సర్‌ మేరీ కోమ్..

Mary kom

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ త్వరలోనే ఆమె దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని.. వీరి నులుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీ కోమ్ వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి విడాకుల గల కారణాల గురించి అనేక ఊహాగానాలు వస్తున్నా.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల వివాదమే వారిని దూరమయ్యేలా చేసిందంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 

బాక్సర్ మేరీ కోమ్ 2005 సంవత్సరంలో ఆంఖోలర్ అకా ఓన్లర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ముగ్గురు అబ్బాయిలు కాగా ఒకరు అమ్మాయి. అయితే ఇంతకాలం హాయిగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలైనట్లు సమాచారం. ముఖ్యంగా వీరిద్దరూ త్వరలోనే విడిపోబోతున్నారని, అధికారికంగా ఈ విషయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. 

నలుగురు పిల్లలతో మేరీకోమ్ విడిగా..

ప్రస్తుతం మేరీకోమ్ తన భర్తతో కలిసి ఉండట్లేదని.. ఇటీవలే తన నలుగురు పిల్లలను తీసుకుని ఫరీదాబాద్‌లోని పుట్టింటికి వెళ్లిపోయిందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆమె భర్త అకా ఓన్లర్ మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం 2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలే అని అంతా భావిస్తున్నారు. అసలు వీరికి, ఆ ఎన్నికలు సంబంధం ఏంటా అనే అనుమానం వస్తోందా.. ఉందండి.. ఆ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త అకా ఓన్లర్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం కోం 2 నుంచి 3 కోట్ల రూపాయలకు వరకు ఖర్చు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. 

ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఓడిపోవడంతో.. మేరీకోమ్ తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా తరచుగా గొడవలు జరుగుతున్నాయని.. అవి తట్టుకోలేకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అకా ఓన్లర్‌కు ముందు నుంచే ఇష్టం లేదని.. కానీ మేరీకోమ్‌యే బలవంత పెట్టి ఆయనతో పోటీ చేయించిందని తెలుస్తోంది. ఆమే బలవంతం పెట్టి రంగంలోకి దింపి.. ఓడిపోయిన తర్వాత భర్తతో గొడవ పడిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మేరీకోమ్ కోసం ఆయన భర్త ఎంతో చేశారని.. ఆయన ఫుట్‌బాల్ కెరియర్‌ను కూడా పిల్లల బాగోగుల కోసం వదులుకున్నట్లు రాసుకొస్తున్నాయి. 

మరోవైపు మేరీకోమ్‌కు మరో మహిళా బాక్సర్ భర్తతో స్నేహం ఉందని.. దాని వల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి.ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియకపోయినప్పటికీ.. వీరి విడాకులు మాత్రం ఖాయం అంటున్నారు.

today-latest-news-in-telugu | boxer | mary-kom

Also Read: TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దేశంలో వడగాలులు ..IMD హెచ్చరికలు!

ఉత్తర, మధ్య భారతదేశంలో వడగాలులు విపరీతంగా వీచే అవకాశాలున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

New Update
heatwave

heatwave Photograph: ( heatwave)

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు విపరీతంగా వీచే అవకాశాలున్నట్లు  భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 25 వరకు యెల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Also Read: Jwala Gutta :పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల!

గుజరాత్​, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని IMD తెలిపింది. ఏప్రిల్ 25 వరకు వేడి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ఎదురుగాలు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఉత్తరాఖండ్​లోని కొన్ని ప్రాంతాల్లోనూ పిడుగుల పడే ఛాన్స్ ఉందని చెప్పింది.

Also Read: Ex Dgp Murder Case: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

మరోవైపు ఇటీవలె వ్యవసాయ రంగానికి తీపి కబురు చెప్పింది భారత వాతావరణ విభాగం (ఐఎండీ). ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్‌-సెప్టెంబరు) దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొందిత. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని ప్రటించింది. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలను కలిపి చూస్తే 56% మంచి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అలానే ఈ ఏడాదిలో ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని వివరించింది. 

డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని, ఇవన్నీ మంచి వర్షాలు కురిసేందుకు శుభపరిణామాలని IMD తెలిపింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, బిహార్‌లలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. 

Also Read:Mumbai:మీ నాన్న లాగే నిన్ను కూడా చంపేస్తాం..బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు!

Also Read: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్లు!

gujarat | imd | imd alert | imd alert heavy rains | heat-wave | delhi-heat-wave | heat-waves | latest-news | telugu-news 

Advertisment
Advertisment
Advertisment