Indore: మంచి చేశా అనుకున్నాడు కానీ ..అడ్డంగా బుక్కయ్యాడు

మధ్యప్రదేశ్ లో  ఓ వ్యక్తి బిచ్చమేసిందుకు గానూ అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 223 కింద అతనిపై కేసు నమోదైంది. ఈ మధ్యనే ఇండోర్ లో బిచ్చం వేయడం, స్వీకరించడాన్ని నిషేధించింది అక్కడ ప్రభుత్వం. అందుకే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

New Update
begging

Begging Prohibited In Indore, Madhya Pradesh

జనవరి 1 నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బిచ్చమెత్తడం, వేయడాన్ని నిషేధించారు. అక్కడ ఉన్న బిచ్చగాళ్లందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. దేశంలోని ప్రధాన నగరాలను యాచక రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజికన్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ 10 నగరాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఇండోర్‌తోపాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అయితే మితా ణగరాల్లో ఇదిఅమలు చేస్తున్నారో లేదో తెలియదు కానీ.. ఇండోర్్లో మాత్ర చాలా స్ట్రిక్ట్గా దీన్ని పాటిస్తున్నారు. అక్కడ బిచ్చగాళ్ళ సమాచారం ఇస్తే వెయ్యి రూపాయల నజరానా కూడా ప్రకటించారు. ఇప్పటికి చాలా మందిదాన్ని అందుకున్నారు కూడా. 

పాపం అడ్డంగా బుక్కయ్యాడు...

అయితే ఈ రూల్ తెలుసో లేక తెలియకనో ఇండోర్ లో ఓ వ్యక్తి ఒక బిచ్చగత్తెకు దానం చేశాడు. దీనిని గమనించిన కొందరు ఈ విషయాన్ని భిక్షాటన నిరోధక బృందం అధికారికి చెప్పారు.  దీంతో రంగంలోకి దిగిన ఆయన బిచ్చమేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 223 కింద గురువారం కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే బిచ్చం ఇచ్చిన దాతకు  ఏడాది వరకు జైలు శిక్ష లేదా 5వేల రూ. జరిమానా లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. 

Also Read :  Donald Trump : ట్రంప్కు బిగ్ షాక్.. భారతీయులకు బిగ్ రిలీఫ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment