/rtv/media/media_files/2026/03/26/indian-among-2-killed-by-falling-missile-debris-in-abu-dhabi-2026-03-26-21-23-59.jpg)
Indian among 2 killed by falling missile debris in Abu Dhabi
అందుపశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్.. UAE రాజధాని అబుదాబీలో క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. లో ఒకరు భారతీయుడు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఇరాన్ నుంచి వచ్చే మిస్సైల్స్ను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థమంతంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్షిపణి శిథిలాలు మీద పడటంతో వీళ్లిద్దరూ చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వాళ్లలో మరొకరు పాకిస్థాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Also Read: అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి ప్రధాని మోదీ మీటింగ్ .. మళ్లీ లాక్డౌన్ విధిస్తారా ?
ఈ క్షిపణి దాడిలో మరో ముగ్గురు గాయపడ్డట్లు యూఏఈ మీడియా తెలిపింది. వీళ్లలో కూడా ఒకరు భారతీయుడు ఉన్నట్లు తెలిపింది. ఇక మరో ఇద్దరిలో ఒకరు UAE, మరొకరు జోర్డాన్ చెందిన వాళ్లని చెప్పింది. అయితే ఈ దాడులకు సంబంధించి ఎలాంటి రూమర్స్ను ప్రజలు నమ్మొద్దని.. అధికారుల నుంచి వెరిఫై చేసుకోవాలని సూచించింది. ఇదిలాఉండగా UAEపై ఇరాన్ దాడులు చేయడాన్ని జోర్డాన్ ఖండించింది. ఇలా దాడులు చేయడం ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: హర్మూజ్ జలసంధిపై పట్టు కోల్పోయిన ఇరాన్.. నావీ చీఫ్ మృతి
Follow Us