Melody : ‘మెలోడీ’ బజ్‌లోకి ఇండియా పోస్ట్: సరికొత్త మీమ్‌తో స్పీడ్ పోస్ట్ ప్రచారం!

భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న అంతర్జాతీయ స్నేహపూర్వక బంధం మెలోడీ గా సోషల్ మీడియాలో ట్రైండైంది. ఈ క్రేజీ సోషల్ మీడియా ట్రెండ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన India Post తన వ్యాపార ప్రచారానికి అద్భుతంగా వాడుకుంది.

New Update
FotoJet - 2026-05-21T210802.280

Speed ​​Post campaign with a new meme

Melody : భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న అంతర్జాతీయ స్నేహపూర్వక బంధం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ఒక హాట్ టాపికే. నెటిజన్లు వీరిద్దరి పేర్లను కలిపి ‘మెలోడీ’ (Melodi = Meloni + Modi) అనే హాష్‌ట్యాగ్‌తో సృష్టించిన మీమ్స్ గత కొన్నేళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఇటీవల ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో (రోమ్ నగరంలో) ఈ మీమ్స్‌కు మరింత బలం చేకూరుస్తూ ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది.  


 
అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో డిజిటల్ యుగం సరికొత్త రంగులను అద్దుతోంది. నెటిజన్లు సరదాగా సృష్టించిన ‘మెలోడీ’ (Melodi) మీమ్‌ను, ఇరు దేశాల ప్రధానులు కూడా అంతే సరదాగా స్వీకరిస్తూ సరికొత్త 'ట్రాఫిక్ దౌత్యానికి' తెరలేపారు. తాజాగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారతదేశపు ఐకానిక్ చాక్లెట్ "పార్లే మెలోడీ" (Parle Melody) టాఫీల ప్యాకెట్లను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన 27 సెకన్ల వీడియోను మెలోని తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో "థాంక్యూ ఫర్ ద గిఫ్ట్" అంటూ పంచుకోగా, అది కేవలం కొన్ని గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వీక్షణలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.

ఇండియా పోస్ట్ ‘స్మార్ట్’ మార్కెటింగ్:

ఈ క్రేజీ సోషల్ మీడియా ట్రెండ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ (India Post) తన వ్యాపార ప్రచారానికి అద్భుతంగా వాడుకుంది. తమ ‘#24 స్పీడ్ పోస్ట్’ (24SpeedPost) సేవల ప్రచారంలో భాగంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రెండు ఆసక్తికరమైన పోస్టర్లను విడుదల చేసింది.మొదటి పోస్టర్లలో మెలోడీ టాఫీల ప్యాకెట్ చిత్రాన్ని చూపిస్తూ.. "దీన్ని మరుసటి రోజు కల్లా ఆమెకు ఎలా డెలివరీ చేయాలి?" అనే క్యాప్షన్‌తో క్యూరియాసిటీ పెంచింది.
రెండవ పోస్టర్లో దానికి సమాధానంగా.. "మరుసటి రోజుకే చేరవేయడానికి మా #24 స్పీడ్ పోస్ట్ ఉందిగా!" అంటూ చాకచక్యంగా తమ ఫాస్ట్ డెలివరీ సర్వీస్‌ను ప్రమోట్ చేసుకుంది.

ప్రభుత్వ సంస్థలు సైతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి 'మూమెంట్ మార్కెటింగ్' (Moment Marketing) ఉపయోగించి కస్టమర్లను ఆకట్టుకోవడం విశేషం.

అసలు ‘మెలోడీ’ మీమ్ ఎలా మొదలైంది?

2023 ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో మోదీ-మెలోనిల పరస్పర సంభాషణల ఫోటోలు, వీడియోల ఆధారంగా నెటిజన్లు తొలిసారిగా ‘Melodi’ అనే పోర్ట్‌మాంటో (రెండు పేర్ల కలయిక) పదాన్ని సృష్టించారు. ఆ తర్వాత జరిగిన జీ7 సదస్సులో స్వయంగా ప్రధాని మెలోనియే మోదీతో కలిసి దిగిన సెల్ఫీని #Melodi హాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయడంతో ఈ మీమ్ అంతర్జాతీయంగా మరింత పాపులర్ అయ్యింది.ఈసారి ఏకంగా ఒక రూపాయి విలువ చేసే క్లాసిక్ ఇండియన్ చాక్లెట్ 'మెలోడీ' ప్యాకెట్‌ను ప్రధాని మోదీ గిఫ్ట్‌గా ఇవ్వడం, దాన్ని ఆమె సాదరంగా స్వీకరించడం సోషల్ మీడియాలో "స్వీటెస్ట్ జియోపొలిటికల్ క్రాస్‌ఓవర్" (Sweetest Geopolitical Crossover) గా నిలిచింది.

 ఒకవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తుంటే, మరోవైపు దీనిపై దేశీయంగా రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి.ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోపై తీవ్రంగా స్పందించింది. పశ్చిమ ఆసియా (Middle East) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు, దేశంలో ద్రవ్యోల్బణం (Mehngai) పెరుగుతుంటే, ప్రధాని మాత్రం విదేశాల్లో 'మెలోడీ' చాక్లెట్లు పంచుతూ పబ్లిక్ రిలేషన్స్ (PR) స్టంట్లలో మునిగిపోయారని ఎక్స్ (X) వేదికగా విమర్శలు గుప్పించింది.

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, దౌత్య సంబంధాలలో ఇలాంటి సరళమైన, హాస్యభరితమైన అంశాలు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని ప్రజలకు సులువుగా చేరువ చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక సాధారణ చాక్లెట్ బ్రాండ్ చుట్టూ ఇంత పెద్ద దౌత్యం, వ్యాపార ప్రచారం జరగడం నిజంగా విశేషమే!

#modi #georgia-meloni #India Post #meloni #trend #melodi #memes
Advertisment
తాజా కథనాలు