MUDA land case : సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్  రిలీఫ్ దొరికింది. ఈ కేసును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తుకు బదలీ చేసేందుకు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

New Update
MUDA land case

MUDA land case

ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్  రిలీఫ్ దొరికింది. ఈ కేసును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తుకు బదలీ చేసేందుకు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.  ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక లోకాయుక్త పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సూచించింది. విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన వ్యక్తికి దర్యాప్తు సంస్థను ఎంపిక చేసే హక్కు లేదని కోర్టు పేర్కొంది. దీంతో పటిషనర్ స్నేహమయి కృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో అవినీతి ఆరోపణలతో సిద్ధ రామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు.

ముడా స్కామ్ ఏంటీ? 

కాగా  సిద్ధరామయ్య తన భార్య పార్వతమ్మ పేర ఉన్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్​అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) సేకరించింది. దీంతో ముడా ఆమెకు వేరే చోట భూమి కేటాయించింది. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఇదంతా జరిగింది. దీంతో సీఎం సిద్ధ రామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు .దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.  ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రధాన నిందితుడిగా, ఆయన భార్య పార్వతి రెండవ నిందితురాలిగా ఆరోపణలు ఎదురుకుంటున్నారు.  

Also Read :  Telangana cabinet : బీసీలకు సీఎం రేవంత్‌ గుడ్‌ న్యూస్‌.. పొన్నం, నీలం మధులకు కీలక పదవులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భార్యతోపాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, భార్యతోపాటు భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియాలో పర్యటించనున్నారు. ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.

New Update
JD vance

JD vance

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ భారత్‌ను సందర్శించనున్నారు. ఉషా వాన్స్‌ భారతీయ సంతతికి చెందిన వారు. వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నట్లు ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. జేడీ వాన్స్ ఫ్యామిలీతో కలిసి ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇటలీ, ఇండియా పర్యటన ఫిక్స్ అయ్యింది. ఆయా దేశాల ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల గురించి చర్చిస్తారని వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఓ ప్రకటన విడుదల అయ్యింది.

Also read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి

ఇండియాలో ఆయన ప్రధాని మోదీని కలపనున్నారు. అమెరికా పర్యటనలో మోదీ జెడి వాన్స్‌ ఫ్యామిలీని కలిశారు. అప్పుడే ఆయన్ని ఇండియాకు ఆహ్వానించారు మోదీ. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను వారు సందర్శించనున్నారు. అలాగే రోమ్‌లో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌తో కూడా సమావేశమవుతారు.

Also read: Donald Trump: ట్రంప్ టార్గెట్ హార్వర్డ్.. యూనివర్సిటీపై తన స్టైల్లో జోకులు

Advertisment
Advertisment
Advertisment