Ashwini Vaishnav: వావ్.. 'త్వరలో గంటకు 280 కి.మీ వేగంతో నడిచే రైళ్లు'

దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు.

New Update
HIGH Speed TRAIN

దూర ప్రయాణాలు చేసేవారికి గుడ్‌న్యూస్‌. దేశంలో త్వరలోనే హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. గంటకు ఏకంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నారు. బీఈఎంఎల్‌(BEML)తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF) లో ఈ రైళ్ల డిజైన్, తయారీ కొనసాగుతోందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో వందేభారత్ రైళ్లు సక్సెస్ అయిన నేపథ్యంలో మేకిన్ ఇండియా స్పూర్తితోనే ఈ హైస్పీడ్ రైళ్ల తయారీని చేపట్టినట్లు పేర్కొన్నారు.   

Also Read: కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి: బీజేపీ నేత

ఖర్చు ఎక్కువే

ఈ రైళ్లను తయారుచేసేందుకు ఒక్కో బోగీకి ట్యాక్సులు మినహాయించి రూ.28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోల్చి చూస్తే ఈ ఖర్చు ఎక్కువవుతుందని తెలిపారు. అంతేకాదు ఈ హైస్పీడ్ రైళ్ల సెట్లను తయారు చేయడం సంక్లిష్టమైనదని.. ఇందులో సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు.  

Also Read: నాకు మోదీ, అమిత్‌ షా సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన

అధునాతన ఫీచర్లు 

సాధారణ రైళ్లతో పోల్చి చూస్తే.. వీటి ఏరోడైనమిక్ భిన్నంగా ఉంటాయని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కనీసం గాలి కూడా చొచ్చుకపోవడానికి వీలు లేకుండా దీని బాడీ ఉంటుందని తెలిపారు. మొత్తం అన్నీ కూడా చైర్‌ కార్సే ఉంటాయన్నారు.ఇందులో అధునాతన ఫీచర్లు ఉంటాయని.. ఆటోమేటిక్ డోర్స్, బోగికి బోగీకి మధ్య లింక్, బయటి వాతావరణానికి అనుగుణంగా బోగి లోపల పరిస్థితులు ఉంటాయని తెలిపారు. అలాగే సీసీటీవీలు, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉంటాయని చెప్పారు. దీని డిజైనింగ్ పూర్తయ్యాక ప్రాజెక్టు పూర్తి అయ్యే ఖర్చుపై ఓ అవగాహన వస్తుందని చెప్పారు. 

Also Read: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు

Also Read: విజయ్‌ పాల్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

భారత ఆయుధాల లిస్ట్ లో మరో కొత్త అస్త్రం చేరనుంది. లేజర్ ఆధారిత వెపన్ ను డీఆర్డీవో మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. గాల్లో ఎగురుతున్న యూవీఏ, డ్రోన్లను ఇది పడగొట్టగలదు. 

New Update
india

Laser Weapon

భారత దేశానికి చెందిన డీఆర్డీవో మరో కొత్త ప్రయోగం చేసింది. భారతదేశానికి కొత్త అస్త్రాన్ని అందించింది. అధిక శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో మొదటిసారి పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో నిర్వహించిన ట్రయల్స్‌లో భాగంగా గాల్లో ఎగురుతున్న యూఏవీ, డ్రోన్లను నేలకూల్చడంలో సఫలమైంది. దీనికి సంబంధించిన  వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఒక వాహనంలో ఈ లేజర్ ఎనర్జీని వెపన్ ను అమర్చారు. దీనికి ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్ అని పేరు పెట్టారు. ఇది యూఏవీ, డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుంది. వాటిని కూల్చడంతో పాటు నిఘా సెన్సార్‌లను పనిచేయకుండా చేసింది. దీనిద్వారా.. లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థను కలిగి ఉన్న దేశాల సరసన భారత్‌ చేరిందని డీఆర్డీవో తన ట్వీట్ లో రాసింది. అయితే ఇది కేవలం ప్రారంభమైనని..ఇలాంటివి మరిన్ని డీఆర్డీవో తయరాు చేసేందుకు సిద్ధంగా ఉందని డీఆర్డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇలాంటి ఆయుధాలను ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా పని చేస్తోందని..మనది నాలుగో దేశమని ఆయన అన్నారు. 

 

 today-latest-news-in-telugu | army

 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

Advertisment
Advertisment
Advertisment