Gold theft : ఏపీ సరిహద్దులో భారీగా బంగారం చోరీ....దాని విలువ ఎంతంటే?

ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో  వీ.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారిదోపిడి ముఠా ఓ కారును అడ్డగించి రూ.3కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. కారును అడ్డగించి కత్తులతో బెదిరించి 3.75 కిలోల బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.

New Update
Gold theft

Gold theft

Gold theft : ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో  వీ.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారిదోపిడి ముఠా ఓ కారును అడ్డగించి రూ.3కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. పోలీసుల కథనం మేరకు.. వేలూరు నుంచి కర్ణాటకలోని కేజీఎఫ్ కు కారులో బంగారాన్ని తీసుకెళ్తుండ‌గా ఆంధ్ర -తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నాయకనేరి అటవీ ప్రాంతంలో ఐదుగురు గుర్తుతెలియని దుండగులు కారును అడ్డగించి కత్తులతో బెదిరించి 3.75 కిలోల బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.

Also Read : మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

కేజీఎఫ్ కు చెందిన మార్వాడి అక్కడ స్థానికంగా ఉన్న దుకాణాలకు బంగారాన్ని ఇస్తుంటాడు. బుధవారం రాత్రి వేలూరు నుండి తన కారులో బంగారాన్ని తీసుకెళ్తుండ‌గా మరో కారులో వెంబడించిన దుండగులు ఆంధ్ర సరిహద్దులోకి వచ్చాక అటవీ ప్రాంతంలో దుండగులు మార్వాడి కారును అడ్డగించారు. ముఖాలకు మాస్కులు ధరించిన దుండగులు మార్వాడిని, వారి డ్రైవర్ ను కత్తులతో బెదిరించి, బంగారాన్ని దోచుకెళ్లారు. ఆరోజు రాత్రి 8.30గంటలకు చోటుచేసుకున్న ఈ సంఘటనతో నివ్వెరపోయిన మార్వాడి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు దర్యాప్తునకు ఆదేశించారు.

Also Read :  గచ్చిబౌలి భూముల్లో అతిపెద్ద ఎకో పార్క్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

డీఎస్పీ ప్రభాకర్, సీఐ సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర – తమిళనాడు పరిధిలో ఉన్న పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచారు. శుక్రవారం చిత్తూరు నుండి వచ్చిన క్లూస్ టీమ్, క్రైమ్ పార్టీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచి ఈ కేసును ఛేదించే పనిలో పోలీసులున్నారు. బంగారు దోపిడీ చేసిన ఐదు మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ     

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు.

New Update
P. chidambaram

P. chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment