Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్

చిల్డ్రన్స్ డే సందర్భంగా రిలయెన్స్ పెద్ద ప్రకటన చేసింది. 50 వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయిస్తామని తెలిపింది. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స కల్పించనున్నారు.

New Update
a

Heart Operation to Kids: 

రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ చిల్డ్రన్స్ డే సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 50 వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పిల్లలు, టీనేజ్ లో
 ఉన్న బాలికలు, మహిళలకు అవసరమైన స్క్రీనింగ్‌లు, చికిత్సలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రారంభించినట్లు ప్రకటించారు. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత స్క్రీనింగ్, చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 50,000 మంది మహిళల్లో రొమ్ము, గర్భాశయ కేన్సర్‌కు ఉచిత స్క్రీనింగ్, చికిత్స అందించనున్నారు. ఇక 10,000 మంది టీనేజ్ పిల్లలకు  ఉచిత గర్భాశయ కేన్సర్ వ్యాక్సినేషన్‌ వేస్తామని ప్రకటించారు.

Also Read: TS: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం‌‌‌‌–రేవంత్ రెడ్డి

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment