Madhavi Latha: బెట్టింగ్ వలలో చిక్కడానికి మూలం అతడే.. నటి మాధవిలత సంచలన ఆరోపణ

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ చేసిన 25 మంది సెలబ్రిటీలు , సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పై కేసులు నమోదయ్యాయి. యూట్యూబర్ అన్వేష్ పై కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మాధవి లత.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే.. అంటూ కామెంట్లు చేసింది.

New Update
Betting Apps

Betting Apps

 Madhavi Latha: బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ చేసిన 25 మంది సెలబ్రిటీలు , సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పై ఇటీవలే పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న వారంతా ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిని నమ్మి బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెట్టి.. కోల్పోయిన ఎంతో మంది బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది.

Also Read : ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

ఈ నేపథ్యంలోనే సినీ ఇండస్ట్రీ కి చెందిన దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అవ్వగా.. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్స్ తో పాటూ పలువురు యూట్యూబర్లపై కూడా కేసు నమోదయింది. అందులో నాని అనే యూట్యూబర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇప్పుడు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ , భయ్యా సన్నీ యాదవ్ ల కోసం గాలింపు చేపట్టారు. ఏ క్షణమైనా వీరిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మరో యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై మండిపడుతూ వారిని వ్యక్తిగతంగా దూషిస్తున్న వేళ ప్రముఖ హీరోయిన్ మాధవి లత కౌంటర్‌ అటాక్‌ స్టా్ర్ట్‌ చేసింది. ఆ వీడియోలతో యూట్యూబర్ అన్వేష్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక వీడియోని కూడా వదిలిన ఈమె అన్వేష్ పై మండిపడుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అసలు కారణం ఇతడే.. అంటూ కామెంట్లు చేసింది.

Also Read :  KYC Deadline: రేషన్ కార్డులదారులకు గుడ్‌ న్యూస్‌..ఆ గడువు పొడిగింపు

 ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై మండిపడుతున్న యూట్యూబర్ అన్వేష్ పై కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చింది మాధవి లత.. ఈమె మాట్లాడుతూ..” ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అని అంటున్నాడో.. అదే వ్యక్తి మీరు కూడా విదేశాలకి వస్తే పాపలతో తిరగవచ్చు. మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్‌ మీద బ్యాటింగ్ చేయొచ్చు.. అని చెబుతున్నారు. ఇతని మాటలు ఏం నేర్పుతున్నాయి.ఇది ఏమాత్రం కరెక్టు.. ఇప్పుడు ఈ వీడియోను చూసే ఫాలోవర్స్ నన్ను అమ్మనా బూతులు తిడతారు. అయినా నాకేం ప్రాబ్లం లేదు. నేను నిజాన్ని నిర్భయంగా చెబుతాను. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే.. ఓహో ఫారిన్ కంట్రీస్ కి వెళ్తే మనం కూడా పాపలతో తిరుగొచ్చు కదా.. ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు అంత అర్జెంటుగా మనకి డబ్బులు ఎవరిస్తారు. మన దగ్గర కూడా డబ్బు ఉంటే మనం కూడా అలా కంట్రీస్ వెళ్లి పాపతో తిరగవచ్చు. కాబట్టి మనకు ఈజీగా డబ్బు కావాలి. దీంతో ఇంకో ఛానల్ ఓపెన్ చేసి.. బెట్టింగ్ యాప్ లో గేమ్ ఆడితే.. ఈజీగా మనీ వస్తుంది మామా అని అంటాడు. మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బ్రతికేయొచ్చు. వేరే ప్రాంతాలకు వెళ్లొచ్చు. వేరే కంట్రీస్ పాపలతో తిరగవచ్చు అని ఆలోచనలో పడి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెడతాడు. తద్వారా ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరిగిపోతాయి అంటూ అన్వేష్ పై మండిపడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది మాధవి లత. ఇక ప్రస్తుతం మాధవి లత చేసిన కామెంట్లకు చాలామంది ఏకీభవిస్తున్నారు. దీంతో అన్వేష్ పై కూడా చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూడాలి.

Also Read : ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

Also read :  Ravindra Jadeja: వీడు మగాడ్రా బుజ్జి.. రవీంద్ర జడేజా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు

జొమాటో తన ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. సుమారు 600 మందిని జాబ్స్ నుంచి తొలగించింది. వీరంతా జాయిన్ అయి ఏడాది కాలేదు. ఖర్చులను తగ్గించుకోవడానికే ఉద్యోగాలను తొలగించామని జొమాటో ప్రకటించింది.  

New Update
zomato

Zomato

అందరి బాటలోనే జొమాటో కూడా నడుస్తోంది. ఏఐను నమ్ముకుని ఉద్యోగాలను తొలగిస్తోంది. ఉద్యోగుల స్థానంలో ఏఐని ఉపయోగించుకుని.. ఖర్చులు తగ్గించుకునే నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా కంపెనీ నుంచి 600మందిని ఉద్యోగం నుంచి తీసేసింది. తొలగించిన ఉద్యోగులు మొత్తం కంపెనీలో జాయిన్ అయి సంవత్సరం కూడా కాలేదని తెలుస్తోంది. తమ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐని ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని మనీ కంట్రోల్ వెబ్‌సైట్ లో వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీన, ఆర్థిక సంవత్సరం మొదలైన రోజునే ఈ ఉద్యోగుల తొలగింపు ప్రకటన రావడం గమనార్హం.

బ్లింకిట్ లో నష్టాలు..

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ లో జొమాటో చాలా ఏళ్ళుగా దూసుకుపోతూనే ఉంది. కానీ కొన్ని రోజుల క్రితం దీనికి అనుబంధ సంస్థగా బ్లింకిట్ ను ప్రవేశపెట్టింది. కానీ బ్లింకిట్ లో ప్రస్తుతం నష్టాలు పెరుగుతున్నాయి. దీనిని ఎదుర్కొనేందుకే జొమాటో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు చెప్పింది. వారి స్థానంలో ఏఐను ఉపయోగించుకోవాలని అనుకుంటోంది జొమాటో. కస్టమర్ సపోర్ట్ కోసం ఏఐని ఉపయోగిస్తోంది. దీనివల్ల తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకోవచ్చని భావిస్తోంది.

today-latest-news-in-telugu | zomato | lay-offs | employees

Also Read: Gold Rates: తాట తీస్తున్న బంగారం..10 గ్రాములు రూ.94 వేలతో సరికొత్త రికార్డ్

Advertisment
Advertisment
Advertisment