Ebola Virus: ఎబోలా వైరస్ వ్యాప్తి... భారతీయుల్లో ఆందోళన?  WHO ఏమంటుందంటే?

ప్రస్తుతం ఆఫ్రికన్ దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఇప్పటికే 118 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై నిఘా పెట్టడంతో భారతదేశంలోనూ దీనిపై చర్చ మొదలైంది.

New Update
FotoJet - 2026-05-19T174213.864

Ebola Virus

Ebola Virus : ప్రస్తుతం ఆఫ్రికన్ దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ ఇప్పటికే 118 మంది ప్రాణాలు కోల్పోగా, 390కి పైగా అనుమానిత కేసులు నిఘాలో ఉన్నాయి. ఈ వైరస్ ఒక దేశం నుండి మరో దేశానికి ప్రయాణించే వారి ద్వారా వ్యాపించే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఇటీవల ఒక అమెరికన్ వైద్యుడికి కూడా ఎబోలా పాజిటివ్‌గా తేలడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై నిఘా పెట్టడంతో భారతదేశంలోనూ దీనిపై చర్చ మొదలైంది.

భారతీయులు ఆందోళన చెందాలా?

 భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎయిమ్స్ (AIIMS) బిలాస్‌పూర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.కె. అరోరా స్పష్టం చేసిన దాని ప్రకారం భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం దేశానికి ఉన్న ప్రమాదం చాలా తక్కువ. ఎబోలా అనేది గాలి ద్వారా లేదా నీటి ద్వారా కరోనా అంత వేగంగా వ్యాపించే వైరస్ కాదు. కాబట్టి ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదు. అయితే, అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా సాగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం.

ముందస్తు జాగ్రత్తలు  

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పటిష్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన 10 నిర్ణయాలు ఇవే:

నిరంతర నిఘా: నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP), ICMR వంటి ఉన్నత స్థాయి విభాగాలు ఆఫ్రికన్ దేశాల్లోని పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి.

ఎంట్రీ పాయింట్ల వద్ద స్క్రీనింగ్: అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులలో ఎబోలా ప్రభావిత ప్రాంతాల (కాంగో, ఉగాండా) నుండి వచ్చే ప్రయాణీకులను నిశితంగా పరిశీలిస్తున్నారు.

పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్‌లు: పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV Pune) ని ఎబోలా టెస్టింగ్ కోసం ప్రధాన కేంద్రంగా గుర్తించారు. అవసరాన్ని బట్టి మరికొన్ని ల్యాబ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు.

ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు: విమానాశ్రయాలు, ప్రధాన నగరాల ఆసుపత్రులలో క్వారంటైన్,ఐసోలేషన్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచారు.

ప్రామాణిక విధానాల (SOP) సమీక్ష: వైరస్ ఒకవేళ దేశంలోకి ప్రవేశిస్తే ఎలాంటి చికిత్స అందించాలి, ఎలా నియంత్రించాలి అనే దానిపై ముందస్తు గైడ్‌లైన్స్ సిద్ధం చేశారు.

ప్రభుత్వ విజ్ఞప్తి: ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేదా WHO విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని కోరింది.

అదనపు సమాచారం:  ఎబోలా గురించి కీలక విషయాలు

ఈ వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండటం అందరికీ శ్రేయస్కరం. దాని గురించిన మరికొన్ని వివరాలు:

1.  ఎబోలా ఎలా వ్యాపిస్తుంది?

ఇబోలా వైరస్ గాలి ద్వారా, ఆహారం లేదా నీటి ద్వారా వ్యాపించదు. ఇది కేవలం: ఎబోలా సోకిన వ్యక్తి లేదా జంతువు యొక్క రక్తం, లాలాజలం, చెమట, వాంతులు, మలమూత్రాలు లేదా వీర్యం (Body Fluids) నేరుగా తగలడం ద్వారా వ్యాపిస్తుంది.సంక్రమిత వ్యక్తి ఉపయోగించిన సూదులు, దుస్తులు లేదా బెడ్ షీట్లను తాకడం ద్వారా కూడా ఇది సోకవచ్చు.

2. ప్రధాన లక్షణాలు ఏమిటి?

 ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుండి 21 రోజులలోపు లక్షణాలు కనిపిస్తాయి:
తీవ్రమైన జ్వరం,అలసటకండరాల నొప్పులు, తలనొప్పి,గొంతు నొప్పి వాంతులు,విరేచనాలు కావడం, పరిస్థితి విషమిస్తే శరీర అంతర్గత, బాహ్య అవయవాల నుండి రక్తస్రావం (Bleeding) కావడం.

3. చికిత్స, నివారణ

ప్రస్తుతం  ఎబోలా నియంత్రణకు కొన్ని వ్యాక్సిన్లు (ఉదాహరణకు Ervebo వ్యాక్సిన్) మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.

భారతదేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉంది. ఆఫ్రికా దేశాలకు ప్రయాణించే వారు లేదా అక్కడి నుండి వచ్చేవారు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సాధారణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.

Advertisment
తాజా కథనాలు