Kamal Haasan : ఫిక్స్ .. రాజ్యసభకు కమల్ హాసన్!

మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. అధికార డీఎంకే  ఆయన్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. దీనికోసం డీఎంకే మంత్రి శేఖర్‌బాబు నిన్న కమల్ తో  చర్చలు జరిపారు. కాగా అధికార డీఎంకేతో కమల్ పార్టీ  పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

New Update
kamal haasan dmk

kamal haasan dmk

Kamal Haasan : మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.  అధికార డీఎంకే  ఆయన్ను  పార్లమెంటు ఎగువ సభకు పంపాలని నిర్ణయించింది. దీనికోసం డీఎంకే మంత్రి శేఖర్‌బాబు నిన్న కమల్ తో  చర్చలు జరిపారు. సీఎం ఎంకే స్టాలిన్ సూచనల మేరకు శేఖర్ బాబు కమల్‌ను కలిశారు.  ఈ నిర్ణయం2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

డీఎంకేతో పొత్తు

2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమల్ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార డీఎంకేతో  పొత్తు పెట్టుకున్నారు. అదే సమయంలో, కమల్ 2024 ఎన్నికల్లో డీఎంకే తరపున ప్రచారం చేశారు.  బదులుగా కమల్ ను రాజ్యసభకు పంపిస్తామని సీఎం స్టాలిన్ ఆయనకు హామీ ఇచ్చారు.  మక్కల్ నీది మయ్యం నుంచి కమల్ తో పాటుగా మరోకరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.  జూలైలో ఖాళీ అయ్యే ఆరు రాజ్యసభ స్థానాల్లో మక్కల్ నీది మయ్యంకు అవకాశం  ఇవ్వనున్నట్లు సమాచారం. 

Also Read: Trump-musk:మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

కాగా కమల్ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది జూన్‌లో విడుదల కానుంది. దీనిని కమల్ రాజ్ కమల్ ఫిల్మ్స్, మణిరత్నం మద్రాస్ టాకీస్ , రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించాయి. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.  

Also Read :  New Ration Card: ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

Also Read :  శ్రీ చైతన్య స్కూల్లో మరో దారుణం.. ఫీజు కట్టలేదని టెన్త్ స్టూడెంట్ను..

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పశ్చిమ బెంగాల్‌లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి

వెస్ట్ బెంగాల్ సీఎంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, యూపీ సీఎం యోగి ఆథిత్య నాథ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రే రాష్ట్రంలో హింస ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

New Update
Union Minister Kiren Rijiju

వక్ఫ్‌ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్‌‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారడంపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల పేరుతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జినే హింసను ప్రేరేపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయమని మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఏప్రిల్ 12 నుంచి  బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందారు. మొత్తం 110 మంది నిరసనకారులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి హింసలో ఉగ్ర సంస్థల కుట్ర ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also read: Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మమతా బెనర్జిపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మండిపడ్డారు. వక్ఫ్‌ సవరణ చట్టానికి నిరసనగా రాష్ట్రంలో హింస చెలరేగుతుంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకేమి పట్టనట్టుగా ఉన్నారని ఆయన విమర్శించారు. వారం రోజులుగా ముర్షిదాబాద్‌ మంటల్లో రగులుతుంటే సీఎం మాత్రం మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. లౌకికవాదం పేరుతో రాష్ట్రంలో అల్లర్లను లేపేవారికి ఆమె పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని యోగీ అన్నారు. 

Also read: Waqf Amendment Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 వల్ల లాభాలు ఇవే..

Advertisment
Advertisment
Advertisment