Delhi Election Counting 2025: ముగిసిన ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ఫైనల్ లెక్కలివే!

ఢిల్లీ కాషాయమయమైంది. 12 ఏళ్లకు పైగా హస్తినలో పవర్ లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి అధికారానికి దూరమైంది. బీజేపీ 48 సీట్లలో విజయం సాధించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పరిమితమైంది. ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులు ఓటమి పాలయ్యారు.

New Update
Delhi Elections 2025 Final Counting Results

Delhi Elections 2025 Final Counting Results

ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 70 సీట్లకు గానూ 48 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్‌ సిసోడియా సైతం  ఓటమి పాలయ్యారు. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 36. దీంతో 48 సీట్లు సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది. సీఎం అభ్యర్థిని ఫైనల్ చేయడం కోసం రంగంలోకి దిగిన అమిత్ షా.. ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేశ్‌ వర్మ సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. 

ఇది అద్భుతమైన తీర్పు: మోదీ

ఢిల్లీలో బీజేపీకి భారీ విజయం దక్కడంపై ప్రధాని మోదీ స్పందించారు. ఇది అద్భుతమైన, చారిత్రాత్మకమైన తీర్పు అని కొనియాడారు. ఢిల్లీ ప్రజలకు అద్భుతమైన సేవ అందిస్తామన్నారు. అభివృద్ధి, సుపరిపాలన గెలుస్తుందన్నారు. ఈ అద్భుతమైన, చారిత్రాత్మక తీర్పు అందించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ ఆశీర్వాదం పొందడం చాలా గౌరవంగా ఉందన్నారు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఏ అవకాశాన్ని వదులుకోబోమన్నారు. ఈ విజయాన్ని అందించడానికి కృషి చేసిన ప్రతీ బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.  

ప్రజల వెంటే ఉంటా: కేజ్రీవాల్

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని.. ఎన్నికల్లో ఓడినా కూడా ప్రజల వెంటే ఉంటామన్నారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజలకు ఎంతో చేశామని చెప్పుకొచ్చారు. విద్య, వైద్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో తాము ఎంతో కృషి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు