Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర... యువతికి తీవ్ర గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి మహిళకు తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో బీజాపూర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన కుంజ పాండే అనే యువతి కాలుతోపాటు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

New Update
Chhattisgarh..

Chhattisgarh

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి మహిళకు తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజాపూర్ జిల్లా రాంపురం గ్రామానికి చెందిన కుంజ పాండే అనే యువతి మూడురోజుల క్రితం కట్టెల కోసం అడవిలోకి వెళ్లింది. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో కాలుతో పాటు చేతులకు తీవ్రగాయాలు అయ్యాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతం కావడంతో సరైన వైద్యం అందలేదు. అక్కడి నుంచి చర్ల మండలం వచ్చేసరికి 3 రోజులు పట్టింది.

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!

Also Read: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్‌ సంచనల వ్యాఖ్యలు

తీవ్ర గాయం కావడంతో..

చర్ల పోలీసులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది యువతిని భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి కుడి కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించి కాలు తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామం నుంచి రహదారి సౌకర్యం లేకపోవడంతో జెట్టి సహాయంతో ఈరోజు ఉదయం యువతి చర్ల సరిహద్దులోకి రావడంతో సీఆర్పీఎఫ్‌ పోలీసులు విషయం తెలుసుకుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Also Read: అయ్యో అశ్విని.. ఎంత పని చేశావమ్మా.. బాధలు బరించలేనంటూ రాసి..!

Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BREAKING : సుప్రీం కోర్టు నూతన CJIగా BR గవాయ్ పేరు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.

New Update
new CJI

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. మే 14న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సుప్రీంకోర్టకు రాకముందు ముంబై హైకోర్టు జడ్జిగా చాలాకాలం పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో గవాయ్ జన్మించారు. 64 ఏళ్ల జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 2025 లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సిజెఐ పదవీకాలం 2025 మే 14 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.

ఈయన తండ్రి ఏఆర్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. లోక్ సభ, రాజ్యసభలో ఎంపీగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, బీహార్, కేరళా,సిక్కిం రాష్ట్రాల గవర్నర్ గా కూడా పని చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment