Wage Rates : కనీస వేతనాలు నెలకు 26,910 రూ.లకు పెంచిన కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. వేతనాలను సవరిస్తూ...నెలకు 26, 910 రూ.లను కనీస వేతనంగా నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ను సవరించింది. By Manogna alamuru 26 Sep 2024 | నవీకరించబడింది పై 26 Sep 2024 19:53 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Wages For Workers : పెరుగుతున్న జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. కనీస వేతనాలను పెంచుతూ ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం 26,910 రూ.లు ఉండాలని చెప్పింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (VDA)ను కేంద్ర ప్రభుత్వం సవరించింది. జీవన వ్యయాన్ని ఎదుర్కోవడంలో ఇది కార్మికులకు సహాయ పడుతుందని ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త వేతన రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని అనౌన్స్ చేసింది. దీని ద్వారా ఏప్రిల్ 2024లో చేసిన చివరి సర్దుబాటుతో కలిపి..ప్రస్తుతం భవన నిర్మాణం, లోడింగ్– అన్లోడింగ్, వాచ్, వార్డ్, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్ కీపింగ్, మైనింగ్ ఇంకా వ్యవసాయంతో సహా వివిధ రంగాలలో నిమగ్నమైన కార్మికులు -కొత్త రేట్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కొత్త రూల్ ప్రకారం..నైపుణ్యం లేని కార్మికులు: రోజుకు రూ. 783 (నెలకు రూ. 20,358)సెమీ స్కిల్డ్ వర్కర్స్: రోజుకు రూ. 868 (నెలకు రూ. 22,568)నైపుణ్యం కలిగిన కార్మికులు, క్లరికల్ స్థానాలు: రోజుకు రూ. 954 (నెలకు రూ. 24,804)హైలీ స్కిల్డ్ వర్కర్స్ మరియు వాచ్ అండ్ వార్డ్ విత్ ఆర్మ్స్: రోజుకు రూ. 1,035 (నెలకు రూ. 26,910) జీతం అందుకోనున్నారు. పారిశ్రామిక కార్మికులకు ఆరు నెలల సగటు పెరుగుదల ఆధారంగా ఏప్రిల్ 1 , అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చే VDAని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తుంది. సెక్టార్, కేటగిరీలు, ప్రాంతాల వారీగా కనీస వేతన రేట్లకు సంబంధించిన వివరాలను clc.gov.inలో తెలుసుకోవచ్చును. Also Read : భార్య బికినీ కోరిక.. రూ.418 కోట్లకు ఐలాండ్ కొనేసిన భర్త! #minimum-wages #workers సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి