CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై CBSE సంచలన నిర్ణయం!
2025లో నిర్వహించబోయే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ హాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా పెట్టాలంటూ CBSE ఆదేశాలు జారీ చేసింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. సీసీటీవీ పాలసీకి సంబంధించి బోర్డు నోటీసు కూడా విడుదల చేసింది.
CBSE : టెన్త్, ఇంటర్ పరీక్షలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ సమయంలో ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరి పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2025లో నిర్వహించబోయే బోర్డు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని పాఠశాలల్లోని క్లాస్ రూముల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (CCTV) నిఘాను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో భాగంగానే సీసీటీవీ పాలసీ బోర్డు నోటీసు విడుదల చేసింది.
8 వేల పరీక్షా కేంద్రాలు..
ఇక పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేకపోతే అక్కడ పరీక్షలు నిర్వహించబోమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. కొత్తగా ప్రవేశ పెట్టిన సీసీటీవీ వ్యవస్థలో పరీక్షలు నిష్పక్షపాతంగా సాగుతాయని బోర్డు పేర్కొంది. ఇక దేశంలోని 26 రాష్ట్రాల్లో ఉన్న 8 వేల పరీక్షా కేంద్రాల్లో సుమారు 44 లక్షల మంది విద్యార్థులు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు రాయనున్నట్లు బోర్డ్ వెల్లడించింది.
Tahawwur Rana: బిర్యానీ పెట్టి పడుకోపెట్టొద్దు.. వెంటనే ఉరి తీయండి: రాణాకు వ్యతిరేకంగా నిరసనలు!
ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు.
Tahawwur Rana: ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు.
#WATCH | Mumbai, Maharashtra: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, a victim of the 26/11 attack, Devika Natwarlal Rotawan says, "I am overjoyed that Tahawwur Rana is finally being brought back to India. This is the biggest victory against… pic.twitter.com/qLldc0TLj0
ఈ మేరకు రాణా నేడు భారతదేశానికి చేరుకోనుండగా అతన్ని తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాధితులు, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.
#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs
ఇక 'రాణాను చివరకు భారతదేశానికి తిరిగి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉగ్రవాదంపై భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం ఇది. అందువల్ల, నేను చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశం, అమెరికా ప్రభుత్వాలకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది. రాణాను తీసుకువచ్చిన వెంటనే అతని నుంచి పాకిస్తాన్లో ఇప్పటికీ దాక్కున్న ఉగ్రవాదుల గురించి సమాచారం సేకరించాలి. రాణాకు వీలైనంత త్వరగా మరణశిక్ష విధించాలి' అని దాడి బాధితురాలు దేవిక నట్వర్లాల్ రోతవాన్ అన్నారు.
ఈ దాడిలో మరణించిన SRPF కానిస్టేబుల్ తండ్రి నిందితుడు రాణాకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. 16 సంవత్సరాల క్రితం జరిగిన ఊచకోత తర్వాత తాను అనుభవించిన మానసిక కుంగుబాటు గురించి ఆయన మాట్లాడారు. '166 మంది ప్రాణాలను బలిగొన్న దాడుల్లో నిందితులందరికీ కఠిన శిక్ష విధించడం అనేది ఉగ్రవాద దాడిలో మరణించిన పోలీసు అధికారులు, పౌరులకు నిజమైన నివాళి అవుతుంది. ఈ ఘోరమైన దాడిలో చాలా మంది మరణించారు. 16 సంవత్సరాల తర్వాత కూడా దాని ప్రతికూల ప్రభావం ఇప్పటికీ నా మనస్సులో ఉంది' అని ఎస్ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రాహుల్ షిండే తండ్రి సుభాష్ షిండే ఎమోషనల్ అయ్యారు.
ఎలా జరిగిందంటే.. 2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకుని నగరంలోని అనేక ప్రాంతాలపై దాడి చేశారు. రైల్వే స్టేషన్, రెండు పెద్ద హోటళ్ళు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడులు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. ఇందులో 166 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ 10 మంది ఉగ్రవాదుల్లో ఒకరు కసబ్ మాత్రమే సజీవంగా పట్టుబడ్డారు. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. నవంబర్ 2012లో పూణేలోని యెర్వాడ జైలులో ఉరితీయబడ్డాడు.