CBSCలో ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల సీబీఎస్‌ఈ పరీక్షల్లో సిలబస్ తగ్గిస్తారని, ఓపెన్ బుక్ పరీక్షలు జరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి. దీనిపై స్పందించిన సీబీఎస్‌ఈ ఈ వార్తల్ని కొట్టిపారేసింది. తాము ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

New Update
book

వచ్చే ఏడాది జరగనున్న 10,12 తరగతుల బోర్డు పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గిస్తారని, పలు సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే వీటిపై తాజాగా సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు స్పందించింది. ఈ వార్తలు అవాస్తవం అంటూ కొట్టిపారేసింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించింది. వచ్చే ఏడాది జరగబోయే పరీక్షల్లో సీబీఎస్‌ఈ ఎలాంటి మార్పులు చేయలేదని ఓ ప్రకటనలో పేర్కొంది.  

Also Read: చెత్త వేస్తే చలానా.. ఫొటో తీసి మరీ పట్టుకుంటారు.. GHMC నయా యాప్ రెడీ!

2025 బోర్డు పరీక్షలకు సంబంధించి తాము అటువంటి నోటిఫికేషన్ ఏదీ కూడా విడుదల చేయలేదంటూ స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తమ అధికారిక వెబ్‌సైట్‌లోనే వివరిస్తామని పేర్కొంది. అందువల్ల ఇలాంటి తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచనలు చేసింది. 

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

ఇదిలాఉండగా.. 10,12వ తరగతి పరీక్షలకు సంబంధించిన డేట్‌షీట్లను మరికొన్ని రోజుల్లోనే సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేయనుంది. సాధారణంగా ప్రతీ సంవత్సరం నవంబర్ నాటికి ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. గత ట్రెండ్స్‌ను చూస్తే.. ఈసారి కూడా ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

New Update
Jammu Kashmir

Jammu Kashmir

రైల్వే మౌలిక సదుపాయాలు, కశ్మీరీ పండిట్ లతో పాటు కశ్మీర్‌ లోయలో పని చేస్తున్న స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నిఘా వర్గాలు ఈ విషయాలను పసిగట్టినట్లు సమాచారం.

Also Read:BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

జమ్మూ కశ్మీర్‌ లో పని చేసే స్థానికేతరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా అక్కడ పని చేస్తున్న రైల్వే ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లినవారే.దీంతో దాడుల ముప్పు దృష్ట్యా రైల్వే భద్రతా సిబ్బంది తమ బ్యారక్‌ ల నుంచి బయటకు రాకుండా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Indian Air Force: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

మరోవైపు కశ్మీరీ పండిట్‌ల లక్ష్యంగా దాడులు చేసేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ప్రణాళికలు వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.వీరితో పాటు శ్రీనగర్‌,గాందెర్బల్‌ జిల్లాల్లోని పోలీసు సిబ్బందికి కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉదన్న వార్తల నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి.

రైల్వే ప్రాజెక్టులను ధ్వంసం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆర్పీఎఫ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Also Read:Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

Also Read: Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?

jammu-kashmir | jammu kashmir attack | latest-news | latest-telugu-news | latest telugu news updates | attack in Pahalgam | Pahalgam attack | army

 

Advertisment
Advertisment
Advertisment