నాగ్‌పూర్ అల్లర్లలో ప్రధాన నిందితుడికి బుల్డోజర్ ట్రీట్‌మెంట్

నాగ్‌పూర్ హింసలో ప్రధాన నింధితుడు ఫహీమ్ షమీమ్ ఖాన్ ఇంటిపై అధికారులు బుల్డోజర్‌ను ఉపయోగించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన ఇంటిని బుల్డోజర్ పెట్టి కూల్చేశారు. ఫహీమ్ షమీమ్ ఖాన్ స్థానికులను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించాడని ఆరోపణలు ఉన్నాయి.

New Update
_Bulldozer treatment

_Bulldozer treatment Photograph: (_Bulldozer treatment )

నాగ్‌పూర్‌లో ఔరంగజేబు సమాధిని కూల్చాలని ర్యాలీగా వెళ్లిన వర్గంతో మరో వర్గం ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకొని హింసకు పాల్పడ్డారు. మార్చి 17న ఈ అల్లర్లు జరిగాయి. నాగ్‌పూర్‌లో చెలరేగిన హింసకు ప్రధాన సూత్రధారి ఫహీమ్ షమీమ్ ఖాన్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. స్థానికంగా ఉన్న వారిని ఫహీమ్ షమీమ్ ఖాన్ రెచ్చగొడ్డి ఘర్షణకు తీసుకొచ్చారు. అతను ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇంటిని అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. కోర్టు అతనికి మార్చి 21 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ప్రధాన నిందితుడు, 38 ఏళ్ల ఫహీమ్ షమీమ్ ఖాన్, ఈ అల్లర్లను ప్రేరేపించడానికి బాధ్యత వహించాడని పోలీసులు పేర్కొన్నారు. షమీమ్ నాగ్‌పూర్ మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ (MDP) అధ్యక్షుడు.

Also read: Rajahmundry Event anchor: అక్రమ సంబంధంలో అనుమానం.. తల్లీకూతుళ్లను పొడిచి చంపిన యువకుడు

Also read: Eknath Shinde: ఏక్ నాథ్ షిండేపై జోక్స్.. కమీడియన్‌పై కేసు నమోదు

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫహీమ్ ఖాన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై పోటీ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఫహీమ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ద్వారా ఆ వర్గ ప్రజలను గొడవకు తీసుకువచ్చాడని తేలింది. ఆ తర్వాత నాగ్‌పూర్‌లో హింస చెలరేగిందని కూడా తేలింది. అతని పేరు కూడా FIRలో నమోదు చేశారు. ఫహీమ్ ఖాన్ నాగ్‌పూర్‌లోని సంజయ్ బాగ్ కాలనీ యశోధర నగర్ నివాసి.

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం

సబర్మతి ఆశ్రమంలో స్పృహ తప్పి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తాను క్షేమంగానే ఉన్ననని తెలిపారు. వీపరీతమైన వేడి కారణంగానే డీహైడ్రేషన్ కు గురైయ్యానని చెప్పారు. అన్ని రకాలుగా బావున్నానని తెలిపారు. 

New Update
P.Chidambaram: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే : పి. చిదంబరం

P. Chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

ఏమవ్వలేదు...బావున్నారు..

ఆసుపత్రిలో చికిత్స అనంతరం చిదంబరం కోలుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్ గురైయ్యానని కాంగ్రెస్ నేత తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తన గురించి ఆలోచించన వారందరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు చిదంబరం కుమారుడు కార్తీ కూడా దీనిపై స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. హార్ట్, బ్రెయిన్ డాక్టర్లతో సహా అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు తమ తండ్రిని పరీక్షించారని...అన్ని రిపోర్ట్ లు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.  స్థానిక జైడస్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

 

 today-latest-news-in-telugu | p-chidambaram | congress | health 

 

Also read :  Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment