భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లు.. బార్డర్ లో ఉద్రిక్తత!

భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన బైరక్టార్ టీబీ2కి మానవరహిత డ్రోన్లు మోహరించినట్లు భారత సైన్యం నిర్ధారించింది. అధికారులు అప్రమత్తమయ్యారు.  

New Update
ererer

National: భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కు చెందిన టర్కిష్ డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్‌లను బంగ్లాదేశ్ సైన్యం మోహరించినట్లు భారత భద్రతా బలగాలు ద్రువీకరించాయి. బార్డర్ కు సమీపంలో బైరక్టార్ టీబీ2కి మానవరహిత వైమానిక వాహనాలను పంపినట్లు నిర్ధారించారు. 

రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు..

ఈ మేరకు బంగ్లాలోని 67వ సైన్యం నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోందని, రక్షణ అవసరాల కోసం డ్రోన్ల మోహరింపు కార్యక్రమం చేపట్టినట్లు ఢాకా అధికారులు చెబుతున్నారు. కానీ బంగ్లాదేశ్‌లో అశాంతి నేపథ్యంలో సున్నితమైన ప్రాంతంలో అధునాతన డ్రోన్లను వినియోగించడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు భారత సైన్యం పేర్కొంది. తాము అప్రమత్తంగా ఉన్నామని, డ్రోన్ విస్తరణలను నిశితంగా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం

తీవ్రవాద కార్యకలాపాలు పెరిగాయి..

మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. సరిహద్దుల్లో భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ రక్షణ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితిని తెలుసుకోవడానికి భారత్ కూడా గూఢచార-భాగస్వామ్య యంత్రాంగాలను,అంతర్జాతీయ భాగస్వాముల సహకారాన్ని తీసుకుంటుందని చెప్పారు.  బంగ్లాదేశ్ లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత సరిహద్దు ప్రాంతాలలో తీవ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని రాజకీయ అస్థిరతను ఉపయోగించుకుని ఉగ్రవాద గ్రూపులు, స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు భారత్‌లోకి చొరబడుతున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు అంచనా వేస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్‌ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!

ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత.. ఫొటోలు వైరల్

ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

రైతు ఉద్యమ నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల నిరాహార దీక్షను విరమించుకున్నాడు. కనీస మద్ధతు ధరపై చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల కోరిక మేరకు ఆయన దీక్ష విరమించారు.

New Update
farmer leadar

farmer leadar Photograph: (farmer leadar)

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఓ రైతు ఉద్యమ నాయకుడు నిరాహార దీక్ష చేశాడు. పంజాబ్‌కు చెందిన జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజులుగా ఏమీ తినకుండా దీక్ష చేస్తున్నాడు. 131 రోజుల తర్వాత అతను నిరాహార దీక్షను విరమించారు. పంజాబ్ రైతుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను ఆయన్ని కోరాయి. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్యల కోసం గత ఏడాది నవంబర్‌ 26న జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రైతు సంఘాలు ఆందోళన చెందాయి.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ నేపథ్యంలో ఫతేగఢ్‌ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరాహార దీక్ష ముగించాలని రైతుల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో శనివారం హాస్పిటల్‌ నుంచి ఇంటికి చేరుకున్న జగ్జీత్ సింగ్ దల్వాల్‌,  రైతుల విన్నపం మేరకు ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం ముగించారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా నిరాహార దీక్షను విరమించాలని జగ్జీత్ సింగ్ దల్వాల్‌ను శనివారం కోరారు. రైతుల డిమాండ్లపై రైతు సంఘాల ప్రతినిధులతో మే 4న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని బిట్టు హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment