అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్‌ అయిన పెద్ద పాదం మార్గం!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు.

New Update
sabarimala

Sabarimala : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో కేరళలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పత్తనంథిట్టా జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు శబరిమలలో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: 'గోదారి గట్టు మీద రామ చిలకవే' సాంగ్ వచ్చేసింది..రమణ గోగుల ఈజ్ బ్యాక్

పంబా నదిలో ప్రవాహం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు మొదలు పెట్టారు. పంబా నదిలో నీటి ప్రవాహాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం కూడా పరిశీలిస్తుంది. ఎన్టీఆర్ఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ టీమ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భక్తులను ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని అధికారులు సూచించారు. నదులు, అటవీ ప్రాంతాల్లోకి భక్తులను అనుమతించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశాయి.

Also Read: TG Crime: హైదరాబాద్‌లో విషాదం..  నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి

Ayyappa Devotees

ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఘాట్‌లలో స్వాములు స్నానాలకు దిగొద్దని హెచ్చరించారు. వర్షాలు తగ్గి, నదుల్లో నీటి ప్రవాహం సాధారణ స్థితికి వచ్చే వరకూ ఈ తాత్కాలిక ఆదేశాలు అమల్లో ఉంటాయని పత్తనంథిట్టా కలెక్టర్ ప్రకటించారు.‘‘తీవ్రమైన వర్షాల కారణంగా పర్వత ప్రాంతాలు, అడవులు ముఖ్యంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే భక్తులు, సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం!

అయ్యప్ప భక్తుల వనయాత్రను నిషేధించారు. కేవలం పంపా బేస్‌ నుంచి మాత్రమే స్వాములను అనుమతిస్తున్నారు. శబరిమలకు చేరుకునేందుకు పులిమేడు మార్గం, ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, పంపా బేస్‌ నుంచి చిన్నపాదం మార్గాలు ఉంటాయి. అలాగే, ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు క్లోజ్‌ చేశారు.

Also Read: Aurobindo: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్

భారీ వర్షాల నేపథ్యంలో గతవారంతో పోల్చితే అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఈవారం కొంచెం తగ్గింది. వర్షాల వల్ల భక్తులు ఎలాంటి ఇబ్బందుల పడకుండా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చర్యలు చేపట్టింది. అప్పాచిమేడు, నీలమలతో పాటు మరకొట్టం నుంచి శరంగుత్తి వరకూ ఉన్న క్యూలైన్‌లో ఉండే స్వాములు వానలో తడవకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

New Update
Agniveers

Agniveers

హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం నాయబ్ సింగ్‌ నేతృత్వంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

'' హర్యానా నుంచి 2022-23లో 2,227 మంది, 2023-24లో 2893 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరారు. త్రివిధ దళాల్లో తమ సర్వీసులు పూర్తి చేసుకున్న అగ్నివీరుల భవిష్యత్తు కాపాడేందుకు మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని'' నాయబ్ సింగ్ సైనీ అన్నారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా హర్యానాలో చేపట్టే కానిస్టేబుళ్లు, ఫారెస్టు గార్డు, జైల్‌ వార్డెన్ల నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఈ మేరకు హర్యానా అగ్నివీర్ పాలసీ 2024ను తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వాళ్లకి కూడా అవసరమైన సబ్సిడీలు అందిస్తామని పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

Also Read: అమెరికాలో అగ్నిప్రమాదం...పది మంది తెలుగు విద్యార్థులు..

 telugu-news | rtv-news | haryana | agniveer | agniveer-jobs

Advertisment
Advertisment
Advertisment