Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్‌లో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 22 మంది పురుషులు, 07 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు . వీరు ఈ ప్రాంతంలో నక్సలైట్ల కోసం చురుకుగా పనిచేస్తున్నారు. 

New Update
Narayanpur

Narayanpur

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. నారాయణపూర్‌లో 29 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో 22 మంది పురుషులు, 07 మంది మహిళా నక్సలైట్లు ఉన్నారు, ఈ నక్సలైట్లంతా కుతుల్ ఏరియా కమిటీ సభ్యులు. వీరు ఈ ప్రాంతంలో నక్సలైట్ల కోసం చురుకుగా పనిచేస్తున్నారు. 

ఇంత పెద్ద స్థాయిలో మావోయిస్టులు లొంగిపోవడం పెద్ద షాకనే చెప్పాలి. ఇంత పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోవడానికి మాద్, నారాయణపూర్ జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులే ప్రధాన కారణమని..  శరవేగంగా నిర్మించిన రోడ్లు, గ్రామాలకు చేరుతున్న వివిధ సౌకర్యాలు వారిని ప్రభావితం చేశాయని నారాయణపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్  చెబుతున్నారు. 

లొంగిపోయిన నక్సలైట్లందరికీ రూ.25,000 ప్రోత్సాహక చెక్కును అందజేసి నక్సల్ నిర్మూలన విధానంలో వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దీంతో జిల్లాలో 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 71 మంది సీనియర్‌, కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయారని.. అదే సమయంలో 60 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందగా, 50 మందిని అరెస్టు చేసినట్లు నారాయణపూర్‌ ఎస్పీ తెలిపారు.

మరోవైపు జార్ఖండ్‌లోని చైబాసా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా కేడర్‌తో సహా ఇద్దరు నక్సల్స్ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులను జోనల్ కమాండర్ సంజయ్ గంఝూ, ఏరియా కమాండర్ హేమంతి, అనల్ గా గుర్తించారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 10 రోజుల్లో హత్యకు గురైన రెండో మహిళా నక్సలైట్ క్యాడర్ హేమంతి. అంతకుముందు జనవరి 22న బొకారోలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏరియా కమాండర్ శాంతి చనిపోయారు.  

Also Read :   అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం

సబర్మతి ఆశ్రమంలో స్పృహ తప్పి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తాను క్షేమంగానే ఉన్ననని తెలిపారు. వీపరీతమైన వేడి కారణంగానే డీహైడ్రేషన్ కు గురైయ్యానని చెప్పారు. అన్ని రకాలుగా బావున్నానని తెలిపారు. 

New Update
P.Chidambaram: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే : పి. చిదంబరం

P. Chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

ఏమవ్వలేదు...బావున్నారు..

ఆసుపత్రిలో చికిత్స అనంతరం చిదంబరం కోలుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్ గురైయ్యానని కాంగ్రెస్ నేత తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తన గురించి ఆలోచించన వారందరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు చిదంబరం కుమారుడు కార్తీ కూడా దీనిపై స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. హార్ట్, బ్రెయిన్ డాక్టర్లతో సహా అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు తమ తండ్రిని పరీక్షించారని...అన్ని రిపోర్ట్ లు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.  స్థానిక జైడస్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

 

 today-latest-news-in-telugu | p-chidambaram | congress | health 

 

Also read :  Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment