Arvind Kejriwal: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం ముందు ఈసీ లొంగిపోయి తన స్వతంత్ర ఉనికిని కోల్పోయిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌ కుమార్‌కు బీజేపీ గవర్నర్ లేదా రాష్ట్రపతి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చి ఉంటుందని ఆరోపించారు.

New Update
Arvind Kejriwal

Arvind Kejriwal

మరో రెండ్రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ పనితీరుపై ఆయన మండిపడ్డారు. కేంద్రం ముందు ఈసీ లొంగిపోయిందని.. ఇది చూస్తుంటే అది తన స్వతంత్ర ఉనికిని పూర్తిగా కోల్పోయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందంటూ ప్రశ్నించారు. 

Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట

ఆయనకు ఏ గవర్నర్ పదవో లేదా రాష్ట్రపతి పదవో ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చి ఉంటుందని అన్నారు. అందువల్లే పదవీ ఆశత దేశ ప్రజస్వామ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్‌పై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకనుంచి అయినా వ్యక్తిగత ప్రయోజనాలపై కాకుండా కొన్ని రోజులైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విధులను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు.

Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం

 అలాగే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ గుండాలు ఆప్‌ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న కూడా ఢిల్లీ పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకనేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. తాము ఢిల్లీ ప్రజల కోసం నెలకు రూ.25,000 ఆదా చేస్తుంటే.. ఇతర పార్టీలు ఢిల్లీకి సమస్యలు తెచ్చిపెడుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి దేశ రాజధానిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Also Read: యూఎస్ఏఐడీ పై మండిపడుతున్న ట్రంప్ అండ్‌ మస్క్‌..ఎందుకో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

New Update
Mohan Bhagwat

Mohan Bhagwat

జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన  ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. 

Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.   

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు. 

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

 mohan-bhagwat | attack in Pahalgam 

Advertisment
Advertisment
Advertisment