Meat : ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే..

ప్రతీ దేశంలో కొన్ని మాంసాల మీద నిషేధం ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని రకాల జంతు మాంసాలు తింటే జైలుకు వెళ్ళాల్సిందే. వాటిల్లో ప్రధానంగా కుందేలు, వన్య ప్రాణులు, నెమళ్ళు...కొన్ని చోట్ల గొడ్డు మాంసంపై నిషేధం ఉంది. 

New Update

Banned Animal Meats: 

జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారులు చేసుకున్న పార్టీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్ చేసుకున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది నిజమో కాదో తెలియదు. ఇక వాస్తవానికి ఇండియాలో పలు రకాల మాంసాలపై నిషేధం ఉంది. 

పవిత్ర జంతువు..

మతపరమైన అంశాల కారణంగా భారత్‌లో కుందేలు మాంసం అమ్మకాన్ని నిషేధించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా భారత్‌లో చాలా ప్రాంతాల్లో గొడ్డు మాంసం తినడం నిషేధం. ఇక ఆవులు, దూడలు, ఎద్దులును వధించడం కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్. అటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం వణ్య ప్రాణుల మంసాన్ని తినడం, అమ్మడం నేరం.

Also Read: Hyderabad: అశోక్‌నర్‌‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు

కుక్క మాంసం...

నాగాలాండ్, మిజోరాంలలో కుక్కల మాంసాన్ని అమ్మడం తినడం చాలా పాత విషయం. కాని ఇది చాలా దారుణమని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్‌ ఆర్గనైజేషన్‌ నాగాలాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కుక్క మాంసం అమ్మకం, సరఫరా, వినియోగాలను నిషేధించడానికి తక్షణం చర్య తీసుకోవాలని కోరింది. కుక్క మాంసం తింటే రాబిస్ వ్యాధి వ్యాపిస్తుందని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.  దీంతో పాటూ సంగీతా గోస్వామి లాంటి ఎన్జీవో సంస్థ నాయకురాలు కూడా దీని మీద ఎన్నో ఏళ్ళుగా పోరాటం సాగించారు. దీంతో నాగాలాండ్, మిజోరాం ప్రభుత్వాలు ఎట్టకేలకు కుక్క మాంసాన్ని నిషేధించాయి. 2020 ఏడాది మార్చి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 

Also Read:TS: తెలంగాణలో భూ ఆక్రమణల నిరోధక చట్టం..ప్రభుత్వం కసరత్తు

జాతీయ జంతువులు, వన్య ప్రాణులు..

ఇక జాతీయ జంతువులు అయిన నెమలి, పులి లాంటి వాటిని తినడం వరకు కాదు వేటాడడమే పెద్ద నేరం. అలాగే జింకలు, లేళ్ళు లాంటి వాటిని కూడా తినడం కొన్నిచోట్ల నేరం. అసలు వనయ ప్రాణులను వేటాడవద్దు, తినవద్దు అని అటు అటవీశాఖ, ఇటు ప్రభుత్వాలు రెండూ చెబుతున్నాయి. వన్య మృగాలను రక్షించుకోవాలని పిలుపునిస్తున్నాయి.

Also Read: బైకుల వెళ్ళే వీలుగా హెజ్బుల్లా బంకర్లు..వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment