Manipur: మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన.. అమిత్‌ షా కీలక ఆదేశాలు

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న వేళ.. అమిత్‌ షా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 8 నుంచి రాష్ట్రంలో అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలన్నారు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.

New Update
Amit Shah

Amit Shah

మణిపూర్‌లో మెయిటీ, కూకీ జాతులు మధ్య నెలకొన్న వైరం రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవలే బీజేపీ నేత బీరెన్ సింగ్‌ సీఎం పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. గత కొన్ని రోజులుగా అక్కడ రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భద్రతా పరిస్థితులపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు

మార్చి 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్గాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్కడ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడంపై ఢిల్లీలో అమిత్‌ షా అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మణిపుర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్మీ, పారామిలటరీ అధికారులు కూడా హాజరయ్యారు.

Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

 ఇదిలాఉండగా గత రెండేళ్లుగా మణిపుర్‌లో అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిని తట్టుకోలేక చివరికి ఇప్పటివరకు సీఎంగా ఉన్న బీరెన్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై క్లారిటీ లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. అలాగే ప్రభుత్వ అధికారాలు గవర్నర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఎవరివద్దైనా అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉంటే 7 రోజుల్లో అప్పగించాలని గవర్నర్‌ అజయ్‌ కుమార్‌ కూడా ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఏడు రోజుల్లోనే ప్రజలు దాదాపు 300 ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలుస్తోంది.

Also Read: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment