Air India : ఇజ్రాయెల్‌కు విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా!

ఇరాన్.  ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత్ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లే విమాన ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ఎయిర్ ఇండియా, టెల్ అవీవ్‌కు నడిపే తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

New Update
Air india

ఇరాన్.  ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత్ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లే విమాన ప్రయాణికులకు భారీ షాక్ తగిలింది. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, టెల్ అవీవ్‌కు నడిపే తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

మే 31 వరకు

తాజా ప్రకటన ప్రకారం, మే 31 వరకు ఇజ్రాయెల్‌కు ఎటువంటి విమాన సర్వీసులు ఉండవు. ఇప్పటికే ఆర్కియా, ఇస్రా ఎయిర్, ఎయిర్ హఫీయా వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేయగా, ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా అదే బాటలో నడిచింది. దీనివల్ల ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న సుమారు 40,000 మంది భారతీయులకు తమ స్వదేశానికి రావడానికి లేదా అత్యవసర ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలగనుంది.

నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో, ప్రయాణికులు ఇప్పుడు ఇతర మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు ముందుగా జోర్డాన్ లేదా ఈజిప్ట్ వంటి పొరుగు దేశాలకు చేరుకుని, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ఇజ్రాయెల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారాన్ని పెంచుతుంది.

ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితులను భారత రాయబార కార్యాలయం నిశితంగా గమనిస్తోంది. అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులతో రాయబార కార్యాలయ అధికారులు నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జె.పి. సింగ్ ఇప్పటికే భారతీయులతో ప్రత్యేక ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహించి, వారికి ధైర్యం చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు.

Advertisment
తాజా కథనాలు