Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు కొన్ని గంటల ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో యాభై మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు.

New Update
amit-shah, Naxalites

amit-shah, Naxalites

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు కొన్ని గంటల ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో యాభై మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ యాభై మంది నక్సలైట్లలో 14 మందిపై రూ. 68 లక్షల రివార్డు ఉంది. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ, "ఆయుధాలు వదిలి అభివృద్ధి మార్గాన్ని అవలంబించే ఏ నక్సలైట్ అయినా పునరావాసం పొంది ప్రధాన స్రవంతిలోకి అనుసంధానించబడతారని మోడీ జీ విధానం స్పష్టంగా ఉంది" అని అమిత్ షా అన్నారు. మిగిలిన వారు ఆయుధాలు వదులుకోవాలని, ప్రధాన స్రవంతిలో చేరాలని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి 31, 2026 తర్వాత, దేశంలో నక్సలిజం చరిత్రగా మారుతుంది, ఇది మా సంకల్పం అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.  ఇప్పటికే ఎన్ కౌంటర్లలో తమ క్యాడర్ ను కోల్పోతున్న మావోయిస్టులకు ఇది నిజంగా పెద్ద షాకనే చెప్పాలి. కాగా మార్చి 29న, దంతెవాడ జిల్లాలో 15 మంది మావోయిస్టులు లొంగిపోగా..  గతేడాది ఆగస్టులో 25 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 

కాంగ్రెస్ విధానాల వల్లే నక్సలిజం ప్రోత్సాహం పొందింది: మోదీ

కాంగ్రెస్ విధానాల వల్లే ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాల్లో దశాబ్దాలుగా నక్సలిజం ప్రోత్సహించబడిందని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బిలాస్‌పూర్ జిల్లాలోని మోహభట్టా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ, పరిస్థితి వేగంగా మారుతోందని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతియుత నూతన యుగం ప్రారంభమవుతోందని అన్నారు. దశాబ్దాలుగా, కాంగ్రెస్ విధానాల కారణంగా ఛత్తీస్‌గఢ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో నక్సలిజం ప్రోత్సాహాన్ని పొందింది. అభివృద్ధిలో ఏ ప్రాంతం వెనుకబడిందో, అక్కడ నక్సలిజం వృద్ధి చెందింది, కానీ 60 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ ఏమి చేసింది? అటువంటి జిల్లాలను వెనుకబడినవిగా ప్రకటించి, దాని బాధ్యత నుండి తప్పుకుందని ఆయన విమర్శించారు.  

Also read :  Aarogyasri card : ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? అయితే ఈ శుభవార్త మీ కోసమే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ మధ్య తరుచుగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఈరోజు మళ్ళీ దేశ వ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. 

New Update
hdfc

UPI

ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ యూపీఐ సేవా పని చేయలేదు. అసలు ఏ ట్రాన్సాక్షన్స్ పని చేయలేదు. రీసెంట్ గా మార్చి 26న యూపీఐ ట్రాన్సక్షన్స్ లో ఇదే సమస్య రాగా మళ్లీ ఇవాళ అదే సమస్య రావడంతో కస్టమర్లు మండిపడుతున్నారు. స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ పే,పేటీఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఐ యాప్స్ పనిచేయకపోవడంతో   కస్టమర్లు ఇబ్బందిపడ్డారు. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం ఏప్రిల్ 2న  రాత్రి 8 గంటల వరకూ యూపీఐ పని చేయడం లేదని 449 ఫిర్యాదులు నమోదయ్యాయి.

కారణం తెలియ లేదు..

యూపీఐ సేవల్లో 64 శాతం మనీ ట్రాన్స్ ఫర్, 28 శాతం పేమెంట్స్, 8 శాతం యాప్ సమమస్యలు తలెత్తాయి. అలాగే ఎస్బీఐలో 57 శాతం కస్టమర్లు మనీ ట్రాన్సక్షన్ జరపడంలో ఇబ్బంది వచ్చిందని కంప్లైంట్ ఇచ్చారు. 34 శాతం మొబైల్ బ్యాంకింగ్ సమస్యలను ఎదుర్కున్నామని చెప్పారు. అయితే  డిజిటల్ పేమెంట్స్ నిలిచిపోవడానికి కారణమేంటని అనేది మాత్రం తెలియలేదు.  దీనిపై సంబంధిత బ్యాంకులు కానీ, యాప్స్ కానీ ఏమీ ప్రకటన చేయలేదు. నేషనల్ కార్పొరేట్ ఆఫ్ ఇండియా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

 today-latest-news-in-telugu | upi

Also Read: RCB VS GT: లివింగ్ స్టోన్ మెరుపులు..గుజరాత్ టైటాన్స్ టార్గెల్ 170

Advertisment
Advertisment
Advertisment