BIG BREAKING: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన

కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అర్ధరాత్రి 1 -2 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తిస్తున్నామన్నారు.  

New Update
Maha Kumbh Stampede

Maha Kumbh Stampede

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. బుధవారం అర్ధరాత్రి 1:00 నుంచి 2:00 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్న మహా కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో ఇప్పటివరకు 25 మందిని గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.  

ఇదిలాఉండగా.. బుధవారం మౌని అమావాస్య సందర్భంగా భారీ  భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌  సెక్టార్ -2 వద్దకు వచ్చారు. అమృత స్నానాల కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తోపులాట జరగగా బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. అయితే తాజాగా డీఐజీ 30 మంది మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ఘటనలో మరో 70 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: సౌదీ అరేబియాలో 9 మంది భారతీయులు మృతి

మౌని అమవాస్య నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వస్తారని అర్ధరాత్రి 12 గంటలకే డీఐజీ వైభవ్‌ కృష్ణ అక్కడ అందిరినీ అలర్ట్ చేశారు. ఆ సమయంలో భక్తులు త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచనలు చేశారు. అలాగే ఘాట్ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని కూడా హెచ్చరించారు. కానీ అప్పటికే భారీగా తరలివచ్చిన భక్తులు పోలీసుల మాటలు వినలేదు. రద్దీ కూడా ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.  

Also Read: అప్పుడు కూడా ఇలానే.. కుంభమేళాలో 800 మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు