ఆ రాష్ట్రంలో ఆకస్మిక వరదలు.. 10 మంది మృతి

మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్‌గారో హిల్స్‌ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది.

New Update
Floods

Meghalaya Floods: మేఘాలయాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా సౌత్‌గారో హిల్స్‌ అనే జిల్లాలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయి. కేవలం 24 గంటల పాటు కురిసినే వర్షాల వల్లే వరదలు రావడంతో ప్రాణనష్టం జరగడం ఆందోళన కలిగిస్తోంది. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 10 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందినవాళ్లలో ఏడుగురు మృతి చెందడం కలకలం రేపుతోంది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కాన్రాడ్‌ సంగ్మా సమీక్ష నిర్వహించారు. కొండచరియల వల్ల రాష్ట్రంలో జరిగిన ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

Also Read: పెరగనున్న సిమెంట్ ధరలు.. బస్తాపై ఎంతంటే?

ఇటీవల కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కూడా కొండచరియలు విరిగిపడ్డ సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో దాదాపు 420 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా చూసుకున్న అనేక దేశాలు వరదల ప్రభావానికి గురవుతున్నాయి. ఇటీవల భారత్‌తో పాటు అమెరికా, చైనా, జపాన్‌లలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణానికి విఘాతం కలగించకుండా అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్లోబల్ వార్మిగ్ పెరగకుండా ఆపాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

రైతు ఉద్యమ నాయకుడు జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజుల నిరాహార దీక్షను విరమించుకున్నాడు. కనీస మద్ధతు ధరపై చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల కోరిక మేరకు ఆయన దీక్ష విరమించారు.

New Update
farmer leadar

farmer leadar Photograph: (farmer leadar)

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఓ రైతు ఉద్యమ నాయకుడు నిరాహార దీక్ష చేశాడు. పంజాబ్‌కు చెందిన జగ్జీత్ సింగ్ దల్వాల్ 131 రోజులుగా ఏమీ తినకుండా దీక్ష చేస్తున్నాడు. 131 రోజుల తర్వాత అతను నిరాహార దీక్షను విరమించారు. పంజాబ్ రైతుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతు సంఘాలను ఆయన్ని కోరాయి. రైతు సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చర్యల కోసం గత ఏడాది నవంబర్‌ 26న జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో రైతు సంఘాలు ఆందోళన చెందాయి.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

ఈ నేపథ్యంలో ఫతేగఢ్‌ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. జగ్జీత్ సింగ్ దల్వాల్ నిరాహార దీక్ష ముగించాలని రైతుల సమావేశంలో కోరారు. ఈ నేపథ్యంలో శనివారం హాస్పిటల్‌ నుంచి ఇంటికి చేరుకున్న జగ్జీత్ సింగ్ దల్వాల్‌,  రైతుల విన్నపం మేరకు ఆమరణ నిరాహార దీక్షను ఆదివారం ముగించారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా నిరాహార దీక్షను విరమించాలని జగ్జీత్ సింగ్ దల్వాల్‌ను శనివారం కోరారు. రైతుల డిమాండ్లపై రైతు సంఘాల ప్రతినిధులతో మే 4న కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని బిట్టు హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment