AP: మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి లోకేష్! ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. By Bhavana 24 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ap: ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ రూమ్ నెంబరు 208లో ఆయన కొద్దిసేపటి క్రితం బాధ్యతలను స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సన్నిహితుల తో కలసి ఆయన తన ఛాంబర్ లోకి ప్రవేశించారు. ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు బాధ్యతలను స్వీకరించడానికి సచివాలయానికి లోకేష్ వస్తుండటంతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పలువురు మంత్రి లోకేష్ కు అభినందనలు తెలిపారు. బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన మంత్రివర్గ సమావేశానికి హాజరు కానున్నారు. Also read: అమెరికాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు! #mega-dsc #ap #lokesh #minister #sign సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి