Africa: ఆకలి తీర్చడానికి వన్యప్రాణుల వధ..ఆఫ్రికాలో కరువు తాండవం

ఆఫ్రికాలో అరుదైన వన్య ప్రాణులను వధిస్తున్నారు. దానికి కారణం అక్కడ విలయ తాండవం చేస్తున్న కరువై కారణం. ఈ నిర్ణయాన్ని స్వయంగా ఆఫ్రికా దేశాల ప్రభుత్వమే తీసుకుంది. దీని కోసం 83 ఏనుగులు సహా పలు జంతువుల జాబితాను సిద్ధం చేసింది.

New Update
Africa: ఆకలి తీర్చడానికి వన్యప్రాణుల వధ..ఆఫ్రికాలో కరువు తాండవం

Drought in Namibia: ఆఫ్రికా దేశమైన నమీబియా కరువుతో అల్లల్లాడుతోంది. గత 100 ఏళ్ళల్లో ఎప్పుడూ లేనంతగా అక్కడ ప్రజలు ఆకలితో మటమటలాడుతున్నారు. ఈ దేశ ప్రభుత్వం దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేకపోవడంతో ప్రజల ఆకలిని తీర్చలేకపోతోంది. దీంతో అడవిలో 700 జంతువులను చంపి..ఆ మాంసం ప్రజలకు పంచాలని నిర్ణయించింది. ఇందులో 83 ఏనుగులో పాటూ జీబ్రాలు, నీటి గుర్రాలు లాంటివి కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆదేశ పర్యావరణ, అటవీశాఖ మంత్రులే తెలిపారు.ప్రభుత్వం వధించాలని డిసైడ్ అయిన అడవి జంతువుల జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు (హిప్పోలు), 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్‌ బీస్ట్‌లు, 300 జీబ్రాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని అడవుల్లో వీటి సంఖ్య అధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

దీని కోసం నిపుణులైన వేటగాళ్ళను నియమించనున్నారు. నైరుతి ఆఫ్రికాలోని కరువు ప్రాంతాల్లో ఈ జంతువులను పంచనున్నారు. ఈ ఏడాది కరవు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. నమీబియాలో జాతీయ అత్యయిక పరిస్థితిని విధించారు. దాదాపు 14,00,000 మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సంఖ్య మొత్తం దేశ జనాభాలో సగానికి సమానంగా ఉంది. ఆఫ్రికాలో నీటి కొరత కూడా అధికంగానే ఉంది. దీనివలన ఆయా జంతువులు జనావాసాల మీద పడి ఇబ్బందులు కూడా పెడుతున్నాయి.

ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య 2,00,000కుపైగా ఉంది. ఈ ప్రాణులు కరవు బారినపడి నీరు దొరక్క గతేడాది భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. బోట్సువానాలో 1,30,000 ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఏనుగుల వేటకు అనుమతి ఉంది.

Also Read: Andhra Pradesh: కడపలో క్యాంపు రాజకీయాలు..నేతలను కాపాడుకునేందుకు వైసీపీ పాట్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. 

New Update
11

చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడు ఇండియా మీద కాలుదువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోడానిక, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉటుది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ తో సమా పొరుగు దేశాతో వ్యాహాత్మక సంబంధలను పెంపొందించుకొంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారీఫ్ లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికా ధీటుగా జవాబిస్తోంది కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చును. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగ్గానే జిన్ పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. 

ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తాం..

తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేదుకు ప్రయత్నిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేస్తామని.. ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వత్తాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు.  ఇందులో భాగంగా జిన్‌పింగ్‌ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.

today-latest-news-in-telugu | china | india | usa | trump tariffs 

Also Read: Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

 

Advertisment
Advertisment
Advertisment