Nagarjuna Sagar: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకోనుంది. By Bhavana 05 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Nagarjuna Sagar Dam: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దీంతో జలకళతో కలకలలాడుతున్నాయి. క్రమంగా నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ గేట్లు అధికారులు తెరిచారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఈరోజు ఉదయానికి చేరుకుంది. దీంతో గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వదలాలని అధికారులు నిర్ణయించారు. కాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 575 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో సోమవారం ఉదయానికి పూర్తి స్థాయిలో నిండనుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్ కి 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. Also Read: కేరళలో మరోసారి నిపా వైరస్ కలకలం..! #latest-news-in-telugu #rains #nagarjuna-sagar #srisailam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి