/rtv/media/media_files/2025/04/24/uJxTNDFbLHHzuAnPtPNU.jpg)
RCB VS RR
ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది. పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ (49), ధ్రువ్ జురెల్ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్ దయల్ వికెట్ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్ వుడ్ 4, కృనాల్ పాండ్య 2, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ ఒక్కో వికెట్ తీశారు.
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ఎవరెన్ని కొట్టారంటే?
ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
కోహ్లీ పరుగుల వరద
32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు.
today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match
Mynampally Hanumantha Rao: మల్లారెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకుంటాం.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే తామే దండా వేసి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి 100 ఎకరాల భూమిని కబ్జా చేసారని.. తన వద్ద అధరాలు ఉన్నాయన్నారు.
Mynampally Hanumantha Rao: మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్లారెడ్డి 100 ఎకరాలు స్వాహా చేశారని ఆరోపించారు. కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే మల్లారెడ్డికి దండ వేసి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తాం అని అన్నారు. అప్పులపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మైనంపల్లి కౌంటర్ ఇచ్చారు. అప్పులెంత..? దోచుకున్నది ఎంత..? అని ప్రశ్నించారు. సబ్జెక్ట్ లేకుండా మల్లారెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నడిచింది... ఇప్పుడు కుదరదని వార్నింగ్ ఇచ్చారు. కుంభకోణాలు బయటపెడితే ప్రజలే మల్లారెడ్డికి భజన చేస్తారని అన్నారు. తిరుమలగిరిలోని పురాతన ఆలయ భూములను మల్లారెడ్డి శిష్యుడు స్వాహా చేసే యత్నం చేశాడని ఆరోపించారు. మల్లారెడ్డి భూకుంభకోణాలన్నింటికీ తన దగ్గర సాక్ష్యాలున్నాయని అన్నారు.
ALSO READ: బీఆర్ఎస్కు మరో షాక్… బీజేపీలోకి మాజీ ఎంపీ!
కేసీఆర్ పైనే మల్లారెడ్డి ఆశలు..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఆయన కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి నందినగర్ లోని సీఎం నివాసానికి వెళ్లారు. ఆక్రమణల్లో నిర్మాణాల కూల్చివేతపై కేసీఆర్తో చర్చించారు. అలాగే మల్లారెడ్డి పార్టీ మారుతారనే ప్రచారంపై కేసీఆర్ అరా తీసినట్లు సమాచారం. దీనిపై కేసీఆర్ కు మల్లారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నీకు ఏం కాదు కాకా.. కేటీఆర్ భరోసా..
మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు మల్లారెడ్డి. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కేటీఆర్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేత వల్ల అయోమయంలో ఉన్న మల్లారెడ్డికి కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. “నువ్వు గిట్ల అయితే ఎట్లా కాకా.. నువ్వు ఫైర్ బ్రాండ్.. నీకు ఏం కాదు.. బీఆర్ఎస్ పార్టీ నిన్ను కాపాడుకుంటుంది.. ఏం ఆలోచించకు మేము ఉన్నాము” అని కేటీఆర్ మల్లారెడ్డికి మోటివేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. బీహార్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం సీన్ నే మార్చేసింది. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతకు తెర లేపింది. దీంతో రెండు దేశాలూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫస్ట్ సేల్ షురూ అయింది. అధికారిక వెబ్సైట్తో పాటు అమెజాన్, రిటైల్ స్టోర్ల నుండి కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే
ఆర్ఆర్తో మ్యాచ్లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!