Minister : భర్తల్ని మద్యం ఇంటికే తెచ్చుకొని తాగమనండి.. మంత్రి సలహా!

భర్తల మద్యం అలవాటు మాన్పించాలనుకున్న మహిళలకు మధ్య ప్రదేశ్‌ మంత్రి నారాయణ్‌ సింగ్‌ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్‌ టాపిక్‌ గా మారింది.భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు తెలిపారు.

New Update
Minister : భర్తల్ని మద్యం ఇంటికే తెచ్చుకొని తాగమనండి.. మంత్రి సలహా!

Minister Advice : భర్తల మద్యం అలవాటు (Drinking Habit) మాన్పించాలనుకున్న మహిళలకు (Women's) మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh) మంత్రి నారాయణ్‌ సింగ్‌ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్‌ టాపిక్‌ గా మారింది. దీంతో ఈ ఘటన గురించి స్పందించిన కాంగ్రెస్‌ (Congress) మంత్రిది మంచి ఉద్దేశమే అయినా ఆయన విధానం బాగోలేదని పేర్కొంది. సామాజిక న్యాయ శాఖ మంత్రి నారాయణ్‌ సింగ్ కుష్వాహా భోపాల్‌ లో మాదక ద్రవ్యాలు, మద్యం ఇతర దురాలవాట్ల పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ్‌ సింగ్‌ (Narayan Singh Kushwah) ప్రసంగిస్తూ భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు తెలిపారు. కుటుంబ సభ్యుల ముందు తాగడం నామోషీగా భావించిన పురుషులు క్రమంగా ఈ అలవాటు నుంచి బయటపడతారని ఆయన అన్నారు. పిల్లలు కూడా తండ్రినే అనుసరిస్తూ మద్యానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని ఆయన మహిళలకు సూచించారు.

ఈ పద్ధతి చాలా మంచి పద్దతని, దీంతో పురుషులు మద్యం అలవాటు నుంచి బయటపడతారని మంత్రి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. నారాయణ్ సింగ్ ఉద్దేశం మంచిదే అయినా ఆయన సలహా మాత్రం సరిగా లేదని అంటున్నారు.

Also read: మహిళలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ నుంచి రూ.2.5 లక్షలతో..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

జమ్మూలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలో ఒక బైక్ ను గుర్తించారు. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు బలగాలు అనుమానిస్తున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
jammu

Unknown bike Found Near Pahalgam

పహల్గాం దాడికి తామే పాల్పడ్డట్టు పాకిస్తాన్‌‌కు చెందిన టెర్రర్​గ్రూపు లష్కరే -తోయిబా స్థానిక శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్  (టీఆర్​ఎఫ్​) ప్రకటించింది. 2017 తరకవాత జమ్మూ కాశ్మీర్ లో దాడి జరగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే. ఉగ్రవాదులు ఈసారి కూడా అచ్చంగా 26/11 ముంబై దాడుల తరహాలోనే చేశారు. పహల్గామ్ దాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. 

నంబర్ ప్లేట్ లేని బైక్..

దాడి జరిగిన దగ్గర నుంచి భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొంత ప్రోగ్రస్ జరిగినట్లు తెలుస్తుంది. పహల్గామ్ లో దాడి జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో ఒక బైక్ ను గుర్తించాయి. దీనికి నంబర్ ప్లేట్ లేదు. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. బైక్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఈరోజు ఎన్ఐఏ బృందాలు రానున్నాయి. 

today-latest-news-in-telugu | Pahalgam attack | terrorists | bike

Also Read:  BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment