Hajj Yatra: హజ్‌ యాత్రలో 550 మందికి పైగా యాత్రికుల మృతి!

సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్‌ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్‌ యాత్రికులు చనిపోయారు.ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు.

New Update
HAJJ: మక్కాలో చనిపోయిన వారిలో 98 మంది భారతీయులు

Hajj Yatra: సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్‌ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్‌ యాత్రికులు చనిపోయారు.ఇందులో ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు. అక్కడి అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఈజిప్టు నుంచి 323 మంది హజ్ యాత్రికులు వేడి వల్ల అస్వస్థతకు గురై అనారోగ్యాల కారణంగా మరణించారు. ఈజిప్టులోని 323 మంది హజ్ యాత్రికులలో ఒకరు మినహా అందరూ వేడి కారణంగా మరణించారని దౌత్యవేత్త ఒకరు వివరించారు.

రద్దీ సమయంలో హజ్ యాత్రికుడు కూడా గాయపడ్డాడు. ఈ డేటా మక్కా సమీపంలోని అల్-ముయిస్సామ్‌లోని ఆసుపత్రి మార్చురీ నుంచి వచ్చిందని అధికారి ఒకరు చెప్పారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొనగా, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు పేర్కొన్నారు. కనీసం 60 మంది జోర్డానియన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సంఖ్య మంగళవారం అమ్మన్ నుంచి విడుదలైన అధికారిక సంఖ్య కంటే ఎక్కువ, ఇందులో 41 మరణాలు నమోదయ్యాయి. కొత్త మరణాలతో అనేక దేశాలు ఇప్పటివరకు నివేదించిన మొత్తం 577కి చేరుకున్నాయి. మక్కాలోని అతిపెద్ద శవాగారాల్లో ఒకటైన అల్-ముయిసం వద్ద మొత్తం 550 మృతదేహాలు ఉన్నాయని దౌత్యవేత్తలు వివరించారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తమ దేశం నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్‌ నిర్వహకులకు తెలిపాయి. వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు వివరించాయి.

Also read: అమెజాన్‌ పార్శిల్ లో పాము..షాకైన కస్టమర్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Israel-Gaza: గాజాను ఎడారిగా మార్చేయండి.. కుక్కల్నీ కూడా వదలొద్దు!

అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయేల్.. అత్యంత దుర్మార్గపు చర్యలకు తెగబడుతోంది. గాజాను మరుభూమిగా మారుస్తోంది.పాలస్తీనియన్ పౌరులు తిరిగి రావడానికి అక్కడ ఏమీ మిగలదని ఇజ్రాయేల్ సైనికులే చెబుతున్నారు.

New Update
12

గాజాను ఇజ్రాయేల్ సైనికులు ఎడారిగా మారుస్తున్నారా? పాలస్తీనియన్లకు అక్కడ నిలువ నీడ లేకుండా చేస్తున్నారా? వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నారా? నివాసానికి పనికి వచ్చే ప్రతి భవనాన్ని కూల్చి వేస్తున్నారా? వ్యవసాయ భూములను కూడా నాశనం చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొంతమంది ఇజ్రాయేల్ సైనికులు తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నారు. పాలస్తీనియన్లు తిరిగి రాలేని విధంగా వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నామని సైనికులు అంటున్నారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

ఇప్పటికే గాజాలోని దాదాపు 50 శాతం భూభాగాన్ని ఇజ్రాయేల్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతాన్ని మిలిటరీ బఫర్ జోన్‌గా మారుస్తోంది. హమాస్‌ నాశనం చేసిన తర్వాత గాజాలో భద్రతా నియంత్రణ తమదే అని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇదివరకే ప్రకటించారు. కాగా, కూల్చివేతల్లో పాల్గొన్న ఒక సైనికుడు మాట్లాడుతూ.. ‘వారు ఇక్కడకు తిరిగి రావడానికి ఇంకా ఏమీ మిగల్లేదు.. ఇక వారు ఎప్పటికీ తిరిగి రాలేరు’ అని అన్నాడు. ఆ నేల బంజరు భూమిగా మారిపోతోందని ఆయన చెప్పాడు.

Also Read: Ap Kurnool MLA:ఏపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం.. సీతమ్మ మెడలో తాళి కట్టిన వైనం.. వీడియో వైరల్

వేలాది మంది పాలస్తీనియన్లు నివసించే ప్రాంతాన్ని ఇజ్రాయేల్ బఫర్ జోన్‌గా మార్చింది. ఈ జోన్‌లో వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. నీటి వసతి సౌకర్యాలను, పంటలను, చెట్లను నాశనం చేయమని తమకు ఆదేశాలు వచ్చాయని  ఇజ్రాయేల్ సైనికులు తెలిపారు. బఫర్ జోన్‌ను కిల్‌ జోన్‌గా మార్చామని మరో సైనికుడు వెల్లడించాడు ‘మాపై దాడిచేసి చంపడంతో మేం ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు వారిని చంపుతాం. కేవలం వారిని మాత్రమేకారు వారి భార్యలను, చిన్నారులు, పిల్లులు, కుక్కలను కూడా చంపుతున్నాం’ అని ఇంకో సైనికుడు అన్నాడు.

‘ఇజ్రాయేల్ సరిహద్దుల్లోని బఫర్ జోన్‌లోదాదాపు గాజా పౌరులు ఖాళీ చేసిన తర్వాత ప్రాథమికంగా ఇళ్లను లేదా శిథిలాల తొలగింపునకు సంబంధించిన మిషన్లను ప్రారంభించాం’ అని చెప్పాడు. ఇది మా దినచర్య అని వివరించాడు. ‘ప్రతి ప్లాటూన్‌కు ఐదు, ఆరు లేదా ఏడు ప్రదేశాలు, ఏడు ఇళ్లు కేటాయిస్తారు.. ఉదయం లేచినప్పటి నుంచి అక్కడే మేము పని చేయాలి. ధ్వంసం చేస్తున్న ప్రదేశాల గురించి లేదా ఎందుకు చేస్తున్నామో మాకు పెద్దగా తెలియదు. బహుశా ఇవి చట్టబద్ధమైనవి కావు అని నేను భావిస్తున్నాను’ అని ఆ సైనికుడు వివరించారు. అయితే, అక్కడ ఎవ్వరూ ఉండకూడదని భావిస్తోన్న ఇజ్రాాయేల్.. పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేస్తోన్నట్టు తెలుస్తోంది.

Also Read: BIG BREAKING: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ కు పెను ప్రమాదం.. విడిపోయిన బోగీలు.. వివరాలివే!

Also Read: South Central Railway: తిరుమలకు 32 ప్రత్యేక రైళ్లు!

hamas | gaza | israel | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment