Modi on Stock Market: స్టాక్ మార్కెట్ జూన్ 4 తరువాత పరుగులు తీస్తుందంటున్న పీఎం మోదీ 

స్టాక్ మార్కెట్ ఎన్నికల ఫలితాల తరువాత పరుగులు తీస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల మార్కెట్ గందరగోళంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక టీవీ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తరువాత ఇన్వెస్టర్స్ కు లాభాల పంట పండుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. 

New Update
Modi on Stock Market: స్టాక్ మార్కెట్ జూన్ 4 తరువాత పరుగులు తీస్తుందంటున్న పీఎం మోదీ 

Modi on Stock Market: స్టాక్ మార్కెట్‌లో జూన్ 4 తర్వాత విపరీతమైన పెరుగుదల ఉండబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే ట్రేడింగ్ వారంలో ట్రేడింగ్ చేసే వారు ట్రేడింగ్‌లో విసిగిపోతారని ఆయన అన్నారు. ఈక్విటీ మార్కెట్ వృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  సీనియర్ క్యాబినెట్ మంత్రులు కూడా మార్కెట్ స్థిరత్వం గురించి హామీ ఇచ్చారు.

ఎన్నికలు ప్రారంభం కాగానే మార్కెట్‌లో ప్రకంపనలు
Modi on Stock Market: దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.  లక్నో, రాయ్‌బరేలీ సహా దేశంలోని అనేక ప్రధాన స్థానాల్లో ఈరోజు ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19న ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి విస్తృత మార్కెట్ సంస్కరణలు చేపట్టేందుకు సరిపడా సీట్లు రాకపోవచ్చని వస్తున్న అంచనాలతో  ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.. ఎన్నికల ఫలితాల తర్వాత అంటే జూన్ 4 తర్వాత మార్కెట్‌లో భారీ పెరుగుదల ఉంటుందని ప్రధాని మోదీ కంటే ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు. 

Also Read: ఈరోజు స్టాక్ మార్కెట్ పనిచేయదు.. కొన్ని చోట్ల బ్యాంకులు కూడా.. ఎందుకంటే.. 

జూన్ 4 తర్వాత..
Modi on Stock Market: స్టాక్ మార్కెట్‌లో జూన్ 4 తర్వాత విపరీతమైన పెరుగుదల ఉండబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం అఖండ మెజారిటీతో తిరిగి రావడం లేదా ఎన్నికల ఫలితాలపై పెట్టుబడిదారులలో ఏదైనా గందరగోళం ఉందా లేదా పెట్టుబడిదారులు ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారా అని ప్రధాని మోదీని ఈ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు మీరు చూస్తారని, ఆ వారం మొత్తం వ్యాపారం చేసేవాళ్లు విసిగిపోతారని అన్నారు.

రిస్క్ హంగర్ పెంచడం అవసరం..
Modi on Stock Market: ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ  ప్రభుత్వం గరిష్ట ఆర్థిక సంస్కరణలు, పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలను అమలు చేసిందని నరేంద్ర మోదీ అన్నారు. మేము వచ్చినపుడు సెన్సెక్స్ 25,000..  ఇప్పుడు సెన్సెక్స్ 75,000 పాయింట్లకు చేరుకుంది. సామాన్యులు స్టాక్ మార్కెట్‌లో ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే ఆర్థిక వ్యవస్థకు అంత మేలు జరుగుతుందని, ప్రతి పౌరునిలో రిస్క్ ఎపిటీషన్ పెరగాలని ప్రధాని అన్నారు. ఈ రోజుల్లో ప్రభుత్వ రంగ షేర్లు కూడా పెరుగుతున్నాయన్నారు.

నిపుణులు ఏమంటారు?
Modi on Stock Market: ప్రధానమంత్రి ఈ ప్రకటన తర్వాత, మార్కెట్ నిపుణులు ఈ ప్రకటనను పాలన కొనసాగింపుకు మరో హామీగా పేర్కొన్నారు. మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు కొంత చొరవ ప్రకటిస్తే తప్ప.. మార్కెట్‌లో పెద్దగా వృద్ధి కనిపించదని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు