Modi : నేడు లక్నోలో పర్యటించనున్న మోదీ.. రూ.10 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

మోదీ 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న 14 వేల ప్రాజెక్టులను సోమవారం లక్నోలో ప్రారంభించనున్నారు. దీని గురించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు 34 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

New Update
Modi : నేడు లక్నోలో పర్యటించనున్న మోదీ.. రూ.10 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సోమవారం లక్నోలో(Lucknow) పర్యటించనున్నారు. ఈ సమయంలో, ప్రధాని మోదీ లక్నోకి కోట్ల విలువైన బహుమతులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న 14 వేల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీని గురించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు 34 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

అయోధ్య, మధుర, కాశీ సహా 8 మత స్థలాలకు శంకుస్థాపన కార్యక్రమంలో 86 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ప్రధాని మోదీ లక్నో పర్యటన

అయోధ్య(Ayodhya), మధుర(Madura), కాశీ(Kasi) కి సంబంధించి దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం. వారణాసిలో రూ.15 వేల కోట్లకు పైగా విలువైన 124 ప్రాజెక్టులు, అయోధ్యలో రూ.10 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులు, మథురలో రూ.13.5 వేల కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

అలాగే, చిత్రకూట్, బుద్ధ భగవానుడి మహాపరినిర్వాణ స్థలం, ఖుషీనగర్, ప్రయాగ్‌రాజ్, నైమిశారణ్య, మీర్జాపూర్ సహా మొత్తం 8 మతపరమైన ప్రదేశాలలో రూ.86 వేల కోట్ల విలువైన పథకాలు ప్రారంభించడం జరుగుతుందని అధికారులు వివరించారు.

యూపీకి లక్షల కోట్ల బహుమతి

ఖుషీనగర్‌లో సుమారు రూ.11,500 కోట్లు, ప్రయాగ్‌రాజ్‌లో రూ.9,500 కోట్లు, చిత్రకూట్‌లో రూ.7,000 కోట్లు, నైమిశారణ్యంలో రూ.21,000 కోట్లు, మీర్జాపూర్‌లో రూ.7,000 కోట్లకు పైగా ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ఇంతకు ముందు అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అయోధ్యకు కానుకగా ఇచ్చింది.

అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఇందులో ప్రముఖమైనది. గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు భారీగా నిధులు వెచ్చించగా, ఇప్పుడు బ్యాంకే బిహారీ కారిడార్‌కు శ్రీకారం చుట్టింది.

Also Read : గ్యాస్‌, అసిడిటీతో బాధపడుతున్నారా? అయితే తక్షణ ఉపశమనానికి ఈ చిట్కాలు పాటించండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!

కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

New Update
Telangana Crime

Telangana Crime Photograph: (Telangana Crime )

భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన హన్ముకొండలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణానికి చెందిన హిమబిందు(34)ను ఎల్కతుర్తి మండలానికి చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి 16 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ 16 ఏళ్ల నుంచి రమేశ్ శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

వేధింపులు భరించలేక..

ఎన్నో సార్లు గ్రామ పంచాయతీ వరకు వీరి గొడవ వెళ్లింది. అయినా కూడా రమేశ్ ప్రవర్తలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో హిమబిందు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ పెట్టి అత్తవారింటికి తీసుకొచ్చారు. మళ్లీ ఇంట్లో గొడవ జరగడంతో మనస్తాపం చెంది హిమబిందు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఇదిలా ఉండగా ఇటీవల వివాహం జరిగిన 22 రోజులకే నవవధువు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హాజీపూర్ మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కంది కవిత- శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా చిన్న కూతురు శృతిని పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత నెల16న వివాహం జరిపించారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత నుంచి భర్త సాయితో పాటు అత్త మామ లక్ష్మి, శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయిందని ఈ మొత్తాన్ని మీ తల్లిదండ్రుల నుండి తేవాలని శ్రుతిని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో ఆ నూతన వధువు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

Advertisment
Advertisment
Advertisment