నాలుక కట్ చేస్తా..లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.! లోకేష్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. లేని ఆరోపణలు చేస్తే నాలుక కట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని విమర్శించేందుకు నీ స్థాయి సరిపోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి MLA Dwarampudi Chandrasekhar: కాకినాడ (Kakinada) జిల్లాలో నారా లోకేష్ (Nara Lokesh) పై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. లేని ఆరోపణలు చేస్తే నాలుక కట్ చేస్తా అంటూ నారా లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "మమ్మల్ని విమర్శించేందు నీస్ధాయి సరిపోదు. నువ్వు ఎమ్మెల్యే కూడా కావు. నీ ఎర్ర బుక్కు మడత పెట్టుకో. కాకినాడలో దొంగ బియ్యం ఎగుమతి అవుతుందో లేదో పయ్యావుల వియ్యంకుడైన సైరస్ కంపెనీ యాజమాని శ్రీనివాస్ ను అడుగు. ఆయన కాకినాడలో టాప్ త్రీ రైస్ ఎక్స్పోర్టర్. మీ సామాజిక వర్గమే" అని అన్నారు. నీ కొవ్వు కరిగించుకోవడానికే పాదయాత్ర చేస్తున్నావు తప్ప..ప్రజల కోసం కాదని లోకేష్ పై మండిపడ్డారు. Also read: రెచ్చిపోయిన కౌశిక్రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.! "నాకు దోపిడి చంద్రశేఖర్ అని పేరు పెట్టావ్. అదే నేను నీకు పేరు పెడితే నువ్వు ..మీ నాన్న ఇంట్లో కూర్చుని ఏడుస్తారు. దేశ వ్యాప్తంగా ఆ పేరు సంచలనం అవుతుంది. దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యావు. నేను ప్రజా క్షేత్రం లో రెండు సార్లు గెలచి ఎమ్మెల్యే అయ్యాను" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే లోకేష్ పొలిటికల్ ఎంట్రీ తరువాతే చంద్రబాబు(Chandra Babu) పతనం ప్రారంభమైందని ఆరోపించారు. ఏపీ బాగుపడాలంటే టిడిపి పోవాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. Also Read: తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ #nara-lokesh #kakanada-mla-dwarampudi-chandrasekhara-reddy #chandra-babu #kakinada సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి