వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి..!!

జాతీయ రహదారులు,రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రం 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.

New Update
వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి..!!

జాతీయ రహదారులు,రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, తీర్థ స్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.

అందులో మొదటి ప్రాధాన్యంగా ఈ క్రింద పేర్కొన్న 780 కి.మీ. ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా ఈ 2024-25 వార్షిక ప్రణాళికలో పెట్టి అప్ గ్రేడ్ చేయవలసిందిగా కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 6 రాష్ట్ర రహదారులను, జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయడం గురించి వివరించినట్లు తెలిపారు.

publive-image

1 చౌటుప్పల్- (NH-65) – ఆమన్ గల్ – షాద్ నగర్ – సంగారెడ్డి (NH-65) 182.
2 మరికల్ (NH-167)- నారాయణ్ పేట్ – రామ్ సముద్రం (NH-150) 63.
3 పెద్దపల్లి (SH-1) – కాటారం (NH-353C) 66.
4 పుల్లురు (NH-44)- ఆలంపూర్ – జెట్ ప్రోల్ – పెంట్లవెల్లి – కొల్లాపూర్ – లింగాల్ – అచ్చంపేట్ – దిండి (NH-765)- దేవరకొండ (NH-167)- మల్లెపల్లి (NH-167)- నల్గొండ (NH-565)- 225.
5 వనపర్తి –కొత్తకోట –గద్వాల్ –మంత్రాలయం(NH-167) 110
6 మన్నెగూడ (NH-163)- వికారాబాద్ – తాండూర్ – జహీరాబాద్ – బీదర్ (NH-50) 134
మొత్తం 780 కిమీ గురించి చర్చించనట్లు తెలిపారు.

publive-image

ఇది కూడా చదవండి: 35 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినాల్సిన ఫుడ్స్ ఇవే..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket: వన్డేల్లో కీలక మార్పు..ఒక బంతితోనే..

క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

New Update
cricket

One day Cricket

వన్డే మ్యాచ్ లలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలింగ్ కు కూడా ప్రాముఖ్యం ఉండేలా మొత్తం మాచ్ అంతా ఒకే బంతితో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. పదేళ్లకు పైగా కొనసాగుతున్న రెండు కొత్త బంతుల పద్ధతిని ఐసీసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ నేతృత్వంలో ఐసీసీ క్రికెట్ కమిటీకి కీలక ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో ఐసీసీ మీటింగ్స్ అవుతున్నాయి. వీటిల్లో దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  

ఒక బంతితోనే..

పదేళ్ల క్రితం వరకు వన్డేలు ఒకే బంతితో ఆడేవారు. బాల్ పాతబడితే రివర్స్ స్వింగ్ బాగా తిరుగుతుంది. అప్పుడు స్పిన్నర్లకు కూడా బంతి మీ పట్టు చిక్కుతుంది. స్పిన్ ను బాగా చేయగలిగే వారు. కానీ పదేళ్ల కితం దీనిని మార్చారు. ఒక్కో ఎండ్‌లో ఒక్కో కొత్త బంతిని ఉపయోగించడం మొదలుపెట్టారు. దీంతో ఒక బంతి ఎక్కువలో ఎక్కువ 25 ఓవర్ల వరకే ఉపయోగించగలుగుతున్నారు. దీంతో రివర్స్ స్వింగ్ సాధ్యపడటం లేదు. బంతిని స్పిన్ చేయడం కూడా అవడం లేదు. దీంతో బౌలర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాటర్లకు ఇది బాగా లాభిస్తున్నా..బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నారు, వికెట్లు తీయడం లేదనే మాటలు పడుతున్నారు. అందుకే ఇప్పుడు రెండు బాల్స్ రూల్ ను తీసేయాలని గుంగూలీ కమిటీ ప్రతిపాదిస్తోంది. దీంతో పాటూ టెస్ట్ లు, టీ20ల్లో కూడా పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

today-latest-news-in-telugu | one-day | cricket | icc

Also Read: AP: సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

 

 

Advertisment
Advertisment
Advertisment