Telangana: ఎంఐఎం, కాంగ్రెస్ లో విలీనమవుతుంది- మహేశ్వర్ రెడ్డి

బీజేపీలో.. బీఆర్ఎస్ మెర్జ్ అవుతుందని అసదుద్దీన్ అంటున్నాడని, ఇందులో ఏమాత్రం నిజం లేదని, కానీ ఎంఐఎం పార్టీయే.. కాంగ్రెస్ లో విలీనమవుతుందని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు.

New Update
Telangana: ఎంఐఎం, కాంగ్రెస్ లో విలీనమవుతుంది- మహేశ్వర్ రెడ్డి

BJLP Leader Maheswara reddy: ఎంఐఎం ఇప్పటికే కాంగ్రెస్ తో చట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి అంటున్నారు. బీజేపీలో బీఆర్ఎస విలీసనం అవుతుందని అసద్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని కొట్టిపారేశారు. రేవంత్ సర్కార్.. రైతులను ఇబ్బందులు పెట్టేందుకే మాఫీకి నిబంధనలు తీసుకొచ్చిందని ఏలేటి విమర్శలు చేశారు. గత ప్రభుత్వంపై విద్యుత్ కొనుగోలులో అవినీతి అంటూ వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి కమిషన్ ను ఏర్పాటుచేసిందని, అయితే విచారణ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును రేవంత్ దున్నపోతుపై వాన పడినట్టుగా భావిస్తున్నారని చురకలంటించారు. ఈ కమిషన్ ఎంక్వైరీలో పారదర్శకత పాటించడం లేదని, అందుకే సీబీఐ విచారణకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కి 10 మంది ఎమ్మెల్యేలు మారారని,అయితే ఆ 10 స్థానాల్లో బై ఎలక్షన్ పెట్టాలని ఆయన డిమాండ చేశారు. ఉప ఎన్నిక జరిగితే బీజేపీకి ప్లస్ అవుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రాకముందే కాంగ్రెస్ 2/3 వంతు సభ్యులను మెర్జ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. అయితే 200 శాతం దానం నాగేందర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నిక తథ్యమని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read:National: ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం – రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment