Microplastics : పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్.. సంతానోత్పత్తిపై ప్రభావం

మగవారి వృషణాల్లో ప్లాస్టిక్‌ కణాలు చేరుతున్నట్లు తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో బయటపడింది. దీనివల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉంది.

New Update
Microplastics : పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్స్.. సంతానోత్పత్తిపై ప్రభావం

Human Health : ప్రపంచవ్యాప్తంగా ప్లాసిక్‌ వాడకం (Plastic Usage) విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికీ తాగే నీళ్లు (Drinking Water), తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతోంది. దీనివల్ల ప్లాస్టిక్‌ కణాలు మన శరీరంలోకి చేరి వివిధ అవయవాల్లోకి కూడా చేరుతున్నాయి. మనుషుల రక్తం, గుండె, తల్లిపాలలో మైక్రో ప్లాస్టిక్స్ (Microplastics) చేరుతున్నాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. అయితే తాజాగా మగవారి వృషణాల్లో (Human Testicle) కూడా ప్లాస్టిక్‌ కణాలు చేరుతున్నట్లు మరో పరిశోధనలో బయటపడింది. దీనివల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Also read: కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు.. నిందితుడు అరెస్టు

ఇక వివరాల్లోకి వెళ్తే.. పరిశోధనలో భాగంగా 23 మంది పురుషుల మృతదేహాలు, 47 పెంపుడు జంతువు కళేబరాల నుంచి సేకరించిన వృషణాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ప్రతి శాంపుల్స్‌లో కూడా మైక్రో ప్లాస్టిక్‌ల కాలుష్యం కనిపించింది. కుక్కల్లో ప్రతి గ్రాము కణజాలంలో 123 మైక్రోగ్రాములు, మానవుల్లో 330 మైక్రోగ్రాముల మేర ఈ రేణువులు కనిపించాయి. ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లలో వాడే పాలీఇథలీన్ పదార్థాలు వృషణాల్లో ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో పీవీసీ ఉంది. అయితే పీవీసీ కాలుష్యం వల్ల శనకాల వృషణాల్లో వీర్య కణాల సంఖ్య తగ్గినట్లు గుర్తించారు. ఈ మైక్రోప్లాస్టిక్‌ల కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందా అనేదానిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే దశాబ్దాలుగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీనికి క్రిమిసంహారకాలు వంటి కెమికల్స్ కారణమని భావిస్తున్నారు. అయితే సూక్ష్మ ప్లాస్టిక్‌లు నీరు, ఆహారం, గాల్లో కూడా తిష్ట వేయడం ఆందోళన రేపుతోంది. ఇవి మనుషుల రక్తనాళాల్లోకి చేరడం వల్ల పక్షవాతం, గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఇక పీవీసీ నుంచి రిలీజ్ అయ్యే రసాయనాలు.. వీర్య కణాల ఉత్పత్తికి ఆటంకం కలిగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మెక్రోప్లాస్టిక్స్‌ వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గొచ్చని ఎలుకలపై జరిగిన పరిశోధనల్లో ఇప్పటికే బయటపడింది.

Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raj Tarun: ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్'తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా టీజర్ విడుదలై ప్రమోషన్స్ షురూ అయ్యాయి. గత వివాదాల తర్వాత పెద్దగా కనిపించలేదు రాజ్, తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. 

New Update
Raj Tarun

Raj Tarun

Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ గురించి చెప్పాలంటే, అతని స్టైల్ కొంచెం ప్రత్యేకమే. కేవలం సినిమా ప్రమోషనన్స్ టైమ్ లో మాత్రమే కనిపించి, తర్వాత పూర్తిగా మాయమవ్వడం అతని అలవాటుగా కనిపిస్తోంది. మూవీ రిలీజ్ టైమ్ లో తప్ప మిగతా రోజుల్లో  ఏమాత్రం అప్‌డేట్స్ లేకుండా మాయమయిపోతుంటాడు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ లాగానే అతని సినిమాలు కూడా అంతే త్వరగా మాయమవుతాయి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాడో, టైటిల్ ఏంటి, ఎప్పుడు విడుదలవుతుందో ఇవేమి ఎవరికీ తేలేదు. సడన్ గా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు.

‘పాంచ్ మినార్’ ప్రమోషన్స్..

అయితే ఈ సారి కూడా అదే జరిగింది,  రాజ్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చాడు. ‘పాంచ్ మినార్’(Paanch Minar) అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. చిత్ర బృందం టీజర్‌ను లాంచ్ చేసింది. ఇకపై సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను వరుసగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విడుదల కూడా త్వరలోనే ఉండబోతుందట.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఇదంతా పక్కనపెడితే, గతంలో రాజ్ తరుణ్ పై వచ్చిన వ్యక్తిగత వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. లావణ్య అనే మహిళ రాజ్ తరుణ్ తన భర్త అని మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించింది. ఆ వివాదం పెద్ద చర్చకు దారితీసినా, చివరికి ఆమెనే మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పింది. తన ఆరోపణలకు తానే క్లారిటీ ఇవ్వడంతో, రాజ్ తరుణ్ తిరిగి తెరపైకి వస్తాడని అందరూ భావించారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

అయితే ఆ వివాదం సద్దుమణిగాక  కూడా రాజ్ తరుణ్ మాత్రం మౌనం వీడలేదు, కావాలనే అజ్ఞాతం లోకి వెళ్ళాడో, లేదంటే ప్లాన్డ్ సైలెన్స్‌లో ఉన్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల దశకు చేరుకోవడంతో మీడియా ముందుకొచ్చిన రాజ్ తరుణ్, సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత మళ్లీ మాయమవుతాడా? అన్నది ప్రెశ్నగా మారింది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Advertisment
Advertisment
Advertisment