Mary Kom: కీలక పోస్టుకు రాజీనామా చేసిన బాక్సర్ మేరీ కోమ్.. ప్రముఖ బాక్సర్ మేరీకోమ్.. ఫ్యారీస్లో జరగనున్న ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్గా వైదొలగినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. By B Aravind 12 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ప్రపంచ బాక్సింక్లో ఆరుసార్లు ఛాంపియన్గా గెలిచిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యారీస్లో జరగనున్న ఒలింపిక్స్ బృందానికి చీఫ్ డీ మిషన్గా వైదొలగినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఇచ్చిన నిబద్ధత నుంచి వెనక్కి తగ్గడం బాధాకరంగా ఉన్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి ఛాయిస్ లేదని అందుకే ఈ పోస్టు నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నారు. Also Read: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు వ్యక్తి.. మేరీ కోమ్ తన పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారని.. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ప్యారిస్లో ఒలంపిక్ గేమ్స్ జరగనున్నాయి. నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఎన్నో దేశాలకు చెందిన క్రీడాకారులు వివిధ గేమ్స్లో పాల్గొంటారు. Also Read: పోలీసులకు అర్చకుల వేషాధారణ.. వివాదంలో బీజేపీ సర్కార్ #telugu-news #national-news #mary-kom సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి