Maoist: సొంత సభ్యులపై మావోయిస్టులు నిఘా.. ప్రజాకోర్టులో పలువురికి మరణశిక్ష కోవర్టులపై మావోయిస్టులు కన్నెర్రజేస్తున్నారు. సొంత సభ్యుల నుంచే పోలీసులకు సమాచారం అందుతుందనే కారణంలో వారిపై అంతర్గత నిఘా పెట్టారు. నిజ నిర్ధారణ తర్వాత ప్రజాకోర్టులో పలువురికి క్షమాభిక్ష పెట్టారు. మరికొందరికి మరణ శిక్ష విధించారు. By B Aravind 30 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇటీవల మావోయిస్టులపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 50కి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కోవర్టుల వల్లే ఈ దాడులు జరుగుతున్నాయని మావోయిస్టులు కన్నెర్ర చేస్తున్నారు. సొంత సభ్యుల నుంచే పోలీసులకు సమాచారం అందుతుందనే కారణంలో వారిపై అంతర్గత నిఘా పెట్టారు. నిజ నిర్ధారణ తర్వాత ప్రజాకోర్టులో పలువురికి క్షమాభిక్ష పెట్టారు. మరికొందరికి మరణ శిక్ష విధించారు. వారం రోజుల్లో నలుగురిని మావోయిస్టులు హత్య చేశారు. హత్యల అనంతరం ఘటనాస్థలంలో లేఖలు వదిలివెళ్లారు. Also Read: ఫోన్ కూడా అవసరం లేదు.. జస్ట్ నవ్వండి అంతే పేమెంట్ అయిపోతుంది! ఎలా అంటే.. విప్లహ ద్రోహనికి పాల్పడితే ద్రోహులుగా మిగిలిపోతారంటూ వార్నింగ్ ఇచ్చారు. భద్రత బలగాల్లో భాగమైతే.. ప్రజాకోర్టులో శిక్ష తప్పదంటూ హెచ్చరించారు. మహిళా మావోయిస్టు నీల్సోతో పాటు మరో ముగ్గురికి మరణ శిక్ష అమలు చేశారు. ప్రస్తుతం కోవర్టుల అంశాన్ని మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం సీరియస్గా పరిగణిస్తోంది. Also Read: మరింత బలంగా హైడ్రా.. అధికార పరిధి పెంపు.. సిబ్బంది కేటాయింపు! #maoism #maoist #telangana-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి