AP: వినుకొండలో దారుణం....వైసీపీ నేత దారుణ హత్య!

వినుకొండ చెక్‌పోస్టు సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డు పై అందరూ చూస్తుండగానే షేక్‌ జిలానీ అనే వ్యక్తి రషీద్‌ అనే వైసీపీ నేతను కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు.ఈ ఘటనలో రషీద్‌ రెండు చేతులు తెగిపోయాయి. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు

New Update
AP: వినుకొండలో దారుణం....వైసీపీ నేత దారుణ హత్య!

Vinukonda: వినుకొండ చెక్‌పోస్టు సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డు పై అందరూ చూస్తుండగానే షేక్‌ జిలానీ అనే వ్యక్తి రషీద్‌ అనే వైసీపీ నేతను కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి హత్య చేశాడు.

ఈ ఘటనలో రషీద్‌ రెండు చేతులు తెగిపోయాయి. తీవ్రగాయాలతో బాధితుడు ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ దారుణ ఘటనతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. మౄతి చెందిన వ్యక్తి రషీద్‌ మద్యం షాపులో క్యాషియర్‌ గా పని చేస్తున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌ కు తరలించారు.

Also Read: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు