అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్‌మెన్‌పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి

అగ్గిపుల్ల ఇవ్వలేదనే కోపంలో 22 ఏళ్ల యువకుడు 53 ఏళ్ల వాచ్‌మెన్‌ను కొట్టి చంపిన దారుణం ముంబైలోని బేలాపూర్ రోడ్‌లో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 1:45 గంటలకు ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా తలపై పెద్ద రాయితో దాడి చేసి చంపిన షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
అగ్గిపుల్ల ఇవ్వలేదని వాచ్‌మెన్‌పై యువకుడి దాడి.. తల పగిలేల కొట్టి

Man Kills Watchmen : ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. మృత్యువు ఎప్పుడు, ఎక్కడినుంచి, ఏ రూపంలో తరముకొస్తుందో ఊహించలేకపోతున్నాం. రోడ్డు ప్రమాదాలు(Road Accident), వాతావరణ విపత్తులే కాదు మనుషుల రూపంలోనూ ప్రమాదం పొంచివుంటుంది. తమ ప్రమోయం లేకుండానే దుండగుల చేతిలో అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నారు. బంగారం, డబ్బులు తదితర చిన్న చిన్న అవసరాల కోసం క్షణికావేశంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఘటనలు చాలానే చూశాం. కానీ తాజాగా అగ్గిపుల్ల కోసం ఓ వృద్ధుడు ప్రాణాలు కొల్పోయిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది.

Also read : రేవంత్‌ కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ.. పోటీపడుతున్న 15 మంది

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. బేలాపూర్(Belapur) రోడ్‌లోని రిక్షా స్టాండ్ వద్ద ఓ కంపెనీలో బాధితుడు 53 ఏళ్ల ప్రసాద్ భానుసింగ్ ఖడ్కా అనే వ్యక్తి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి 1:45 గంటల ప్రాంతంలో అటువైపుగా వచ్చిన 22 ఏళ్ల మహ్మద్ ఆదిల్ అజమాలి షేక్ అనే యువకుడు.. భానుసింగ్ దగ్గరకు వచ్చి అగ్గిపుల్ల కావాలని అడిగాడు. ఈ క్రమంలో భానుసింగ్ తనవద్ద లేదని, ఉన్నా ఇవ్వనని నిరాకరించడంతో షేక్ తీవ్ర కోపంతో ఊగిపోయాడు. దీంతో పక్కనే ఉన్న పెద్ద రాయితో భానుసింగ్ పై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయలవడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సాయంతో విషయం తెలుసకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు షేక్ ను వెంటనే అరెస్టు చేసి, అతనిపై ఇండియన్ పీనల్ కోస్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!

కర్ణాటకలో దారుణం జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతిని కండక్టర్ లైంగికంగా వేధించాడు. నిద్రిస్తుండగా ఆమె పక్కనే నిలబడి పదేపదే టచ్ చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.

New Update
Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

Conductor sexually harasses young woman sleeping on bus in karnataka

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మానవత్వం, మంచి మరచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నా.. వంద మందిలో ఉన్నా.. పాడు బుద్దితో అతి నీచంగా, అసభ్యకంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. గతం కంటే ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. 

Also Read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్

తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఒక యువతిపై కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆ యువతి పక్కనే నిలబడి.. చేతులతో టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కండక్టర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కామ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్

Also Read: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

నిద్రపోతున్న యువతిపై

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మంగళూరు సమీపంలోని ముడిపు-స్టేట్ బ్యాంక్ మార్గంలో నడిచే కేఎస్ఆర్టీసీ బస్సులో ఓ యువతి నిద్రపోతుంది. అదే సమయంలో బస్సు కండక్టర్ ఆమె పక్కకి వచ్చి నిలబడి ఆ యువతిని పదేపదే టచ్ చేస్తూ లైంగికంగా వేధించాడు. ఆమె కూర్చున్న సీట్‌ పక్కనే నిల్చుని మెల్ల మెల్లగా చెయ్యి వేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణీకుడు ఈ సంఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. అది కాస్త రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేఎస్ఆర్టీసీ అధికారులు ఆ కండక్టర్‌ను విధుల నుంచి తొలగించారు. 

Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

viral-news | viral-video | crime news
Advertisment
Advertisment
Advertisment