Crime : 8 రోజుల క్రితం పెళ్లి.. 8 మందిని చంపి.. తాను కూడా చచ్చాడు!

మధ్య ప్రదేశ్‌ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న  చింద్వారా జిల్లాలోని బోద‌ల్ క‌చ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది.

New Update
Crime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి!

Suicide Deaths :  మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh) లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన చింద్వారా జిల్లాలోని బోద‌ల్ క‌చ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ‌స‌భ్యుల‌ను హ‌త్య చేసిన వ్య‌క్తి మతి స్థిమితంగా లేన‌ట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు.

ఈ ఘాతుకానికి పాల్ప‌డిన వ్య‌క్తికి ఎనిమిది రోజుల క్రిత‌మే వివాహమైన‌ట్లు తెలుస్తోంది. త‌న భార్య‌తో పాటు సోదరుడు, అత‌ని భార్య‌, ముగ్గురు పిల్ల‌లు, త‌ల్లిని అత‌డు అతి కిరాత‌కంగా న‌రికి చంపేశాడు (Family Murder). ఎనిమిది మంది బాధితులు వరండాలో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఈ దారుణం జరిగిన ప్రాంతానికి కలెక్టర్‌, ఎస్పీ వెళ్లారు. ఈ ఘట‌న ప‌ట్ల పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టారు. మంగ‌ళ‌వారం రాత్రి కుటుంబ‌స‌భ్యుల‌పై ఆ వ్యక్తి అటాక్ చేసిన‌ట్లు ఎస్పీ ఖ‌త్రి తెలిపారు. సోద‌రుడు, కోడ‌లు, భార్య‌తో పాటు మ‌రో చిన్నారిని కూడా ఆ వ్య‌క్తి హ‌త్య చేశాడు. అంద‌ర్నీ హ‌త్య చేసిన త‌ర్వాత ఆ వ్య‌క్తి స‌మీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు (Suicide). ఆ కుటుంబానికి చెందిన ఒక్క చిన్నారి మాత్ర‌మే ఆ దాడిలో గాయాల వ‌ల్ల బ‌య‌ట‌ప‌డ్డాడు. ప్ర‌స్తుతం ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఏ కార‌ణం చేత ఆ వ్య‌క్తి హ‌త్య‌కు పాల్ప‌డ్డాడో తెలియ‌దు.

Also read: వందేభారత్‌ లో భారీ పేలుడు..ఉలిక్కిపడ్డ ప్రయాణికులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు