TS Politics : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెల్ లో చేరారు. త్వరలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న వేళ ఈ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. By Nikhil 20 Mar 2024 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Shock To BRS : ఉమ్మడి పాలమూరు(Palamooru) జిల్లాలో బీఆర్ఎస్(BRS) కు బిగ్ షాక్ తగిలింది. త్వరలో ఎంపీ ఎన్నికల(MP Elections) తో పాటు.. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలు(MLC By-Elections) జరగనున్న వేళ జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహబూబ్ నగర్(Mahbubnagar) జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి హస్తం గూటికి చేరిపోయారు. 2019 జిల్లా పరిషత్ ఎన్నికల్లో భూత్పూర్ నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు స్వర్ణ సుధాకర్ రెడ్డి. నిన్ననే గద్వాల్ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. మంత్రి జూపల్లి సమక్షంలో కేశవ్ తో పాటు 16 మంది కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరిపోయారు. వరుస వలసలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేడర్ ను కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. Also Read : రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఎకరాకు రూ.10 వేలు! #mahabubnagar #2024-lok-sabha-elections #cm-revanth-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి