విక్రమ్‌ ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్.. రిలీజ్ పై ఉత్కంఠ

విక్రమ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ల ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి దర్శకుడు గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్‌ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఈ సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
విక్రమ్‌ ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్.. రిలీజ్ పై ఉత్కంఠ

స్టార్ హీరో చియాన్ విక్రమ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ధృవ నక్షత్రం’. నవంబర్ 24న విడుదల కావాల్సిన మూవీ మరోసారి వాయిదాపడింది. దర్శకుడు గౌతమ్, నిర్మాణ సంస్థ ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ మధ్య ఆర్థికపరమైన గొడవలు తలెత్తడంతో ఈ ఇష్యూ కోర్టు వరకూ వెళ్లింది. దీంతో తాజాగా దీనిపై తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి గౌతమ్ తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా రిలీజ్ ఆపేయాలని స్పష్టం చేసింది.

అసలు విషయానికొస్తే.. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అయితే శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌ ‘సూపర్‌ స్టార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ఆ మేరకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని, కానీ ఆయన సినిమాని పూర్తి చేయలేదని.. డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నగదు తిరిగి ఇవ్వకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు. గురువారం ఈ కేసు విచారణకు రాగా న్యాయస్థానం సినిమా విడుదలకు షరతు విధించింది. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్‌ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఈ సినిమాలో రీతూవర్మ, సిమ్రన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also read : Bhagavanth Kesari: ఓటీటీ లో బాలయ్య భగవంత్ కేసరి..!

ఇదిలావుంటే.. ఇటీవల ఓ సందర్భంలో సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన గౌతమ్.. ‘నటనపై ఆసక్తితో సినిమాల్లో నటించడం లేదు. ‘ధృవ నక్షత్రం’ కోసమే నేను నటుడిగా మారా. ఆయా చిత్రాల్లో యాక్ట్‌ చేసినందుకుగాను వచ్చిన పారితోషికాన్ని ఈ సినిమా మేకింగ్‌.. విడుదల కోసం ఉపయోగించా. సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఇప్పటివరకూ ఎవరినీ అడగలేదు. కొన్ని సినిమాల్లో అవకాశాలనూ వదులుకున్నా’ అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

సూర్యా నటించిన 'రెట్రో' సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ్,తెలుగు వర్షన్లకు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానుండటం తో సినిమాపై హైప్ పెరిగిపోయింది.

New Update
Retro Pre Release

Retro Pre Release

Retro Pre Release: సూర్యా(Surya) హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'రెట్రో', కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందింది. మే 1న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే తమిళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం అంతటి హైప్ కనిపించడం లేదు. ప్రత్యేకంగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ను చూస్తే, ఇది చాలా యూనిక్‌గా ఉండటంతో మాస్ ఆడియెన్స్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ గట్టి ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

చీఫ్ గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్‌లలో భాగంగా, ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'కింగ్‌డమ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

రెట్రో చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైం మొత్తం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాలు. పూజా హెగ్డే(Pooja Hegde) ఈ సినిమాలో సూర్యా సరసన కథానాయికగా కనిపించనుంది. అలాగే జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, నందితా దాస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా, సూర్యా తన భార్య జ్యోతికతో కలిసి తన సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా "కనీమా" పాటలో సూర్యా – పూజా హెగ్డేల డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం ముందుగానే విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమోషన్లు సినిమాపై మరింత హైప్‌ను పెంచేసాయి.

మే 1న 'రెట్రో' థియేటర్లలో ఆకట్టుకోనుంది. యాక్షన్, రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కలబోతగా ఉండే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment