MLA Harish Rao: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. హరీష్ రావు ఫైర్

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా మాట తప్పిందని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని.. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Harish Rao: రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో మభ్యపెట్టింది: హరీష్ రావు

MLA Harish Rao: మొద్దు ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి రైతు దీక్షలు చేస్తున్నామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వంద రోజుల కాంగ్రెస్ (Congress) పాలనలో 200 మంది రైతులు చనిపోయారని పేర్కొన్నారు. వారి కుటుంబాలను ఏ మంత్రీ పరామర్శించడం లేదని విమర్శించారు. ఎండిన పంటపొలాలను చూడడానికి రావడం లేదని అన్నారు. కరెంటు లేదు, నీళ్లు లేవు... కన్నీళ్లే మిగిలాయని అన్నారు.

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 20 లక్షలు పరిహారం చెల్లించాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు, చిల్లర మాటలు మాని, రైతులను కాపాడాలని.. మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతుబంధు 15 వేలు, వడ్లకు మక్కలకు 500 బోనస్, రైతు కూలీలకు 12 వేలు, కౌలు రైతుల 15 వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు.

మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ (BJP) కూడా మాట తప్పిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలని.. వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చాక కళ్లు నెత్తుకెక్కాయని ఫైర్ అయ్యారు.

Also Read: నెత్తుటి బాకీ తీర్చుకుంటాం.. రేవంత్ సర్కార్‌కు మావోయిస్టుల హెచ్చరిక

హరీష్ రావు కామెంట్స్..

* రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టమన్నడు కోమటిరెడ్డి అని మండిపడ్డారు.
* మీతో చెప్పుతో కొట్టించుకోవడానికి మిమ్మల్ని గెలిపించింది?
* కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప ఎండడు లేదు.
* కాంగ్రెస్ వచ్చింది, కరువొచ్చింది.
* పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు.
* మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదు.
* రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుంది.
* రైతులు ధైర్యంగా ఉండాలి. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు అండగా మేముంటాం.

Advertisment
Advertisment
తాజా కథనాలు