Congress: కడియం ముందే కొట్టుకున్న కార్యకర్తలు.. వాకౌట్‌ చేసిన కడియం!

కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్‌ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.

New Update
Congress: కడియం ముందే కొట్టుకున్న కార్యకర్తలు.. వాకౌట్‌ చేసిన కడియం!

Congress: మాజీ ఉప ముఖ్యమంత్రి , స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)  బీఆర్‌ఎస్‌ (BRS) ని వీడి కాంగ్రెస్(Congress) లోకి వచ్చిన తరువాత వరంగల్‌ రాజకీయాల్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడియం , ఆయన కుమార్తె ఎంట్రీని కాంగ్రెస్‌ నేతలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు.దీంతో అధిష్ఠానం కల్పించుకోవడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి.. అంతా ఓకే అనుకునే సమయంలో ఒక్కసారిగా వర్గ విభేదాలు బయట పడ్డాయి.

ఇదివరకే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్‌ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.

అది కాస్తా ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు చేరుకుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడియం, ఇందిరా అనుచరుల తీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే వరంగల్ పార్లమెంట్ పరిధిలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో బుధవారం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, పార్టీ నియోజకవర్గ నాయకురాలు సింగపురం ఇందిరా, ఇతర నాయకులు అంతా హాజరయ్యారు.

ఈ సమావేశానికి నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కడియం అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు.దీంతో ముందు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. కాగా ఈ చేరికల్లో ప్రధానంగా కడియం శ్రీహరి అనుచరుడు, లింగాల గణపురం జడ్పీటీసీ సభ్యుడు గుడి వంశీధర్ రెడ్డి, ఇంకొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారు.

దీంతో వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరడం ఇష్టం లేని కొందరు ఆయన చేరికను వ్యతిరేకించారు. ఆయన్నిపార్టీలోకి తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ మీటింగ్ హాల్ వద్ద ఆయన ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల నడుమ మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఓ వైపు స్టేజీ మీద కడియం శ్రీహరి, ఇందిరాతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య, ఇతర నాయకులు ఉండగానే ఇరువర్గాల కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగారు. తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా.. కడియం సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.అయినా కొంతమంది వినకుండా వాగ్వాదం కొనసాగించారు. దీంతో చిన్నగా మొదలైన గొడవ కాస్త కంట్రోల్ తప్పే పరిస్థితికి చేరింది. అనూహ్య పరిణామంతో కంగుతిన్న కడియం శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. చేరికల కారణంగా వివాదం మొదలు కావడంతోకడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ ఆ కార్యక్రమం పూర్తి కాకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తరువాత అక్కడ చాలాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొనగా.. కడియం శ్రీహరి, కావ్య అక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత అందరూ సైలెంట్ అయి మీటింగ్ ను ముగించారు.

Also read: అక్కడ పోలీసులు యూనిఫాం మారింది…ఇక నుంచి ధోతి-కుర్తా!

Advertisment
Advertisment
తాజా కథనాలు